Webdunia - Bharat's app for daily news and videos

Install App

లడ్డూ కల్తీ.. జగన్ నివాసం వద్ద ఉద్రిక్తత.. భద్రత పెంపు

సెల్వి
సోమవారం, 23 సెప్టెంబరు 2024 (14:34 IST)
వైసీపీ ప్రభుత్వ హయాంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యి కల్తీ అని నిర్ధారణ కావడంతో శ్రీవారి భక్తులు, వివిధ హిందూ ధార్మిక సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద బీజేపీ యువమోర్చా నాయకులు నిరసనకు దిగడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. 
 
తిరుమల లడ్డూను అపవిత్రం చేయడాన్ని కార్యకర్తలు ఖండించారు. ఆందోళనకారులు మాజీ సీఎం జగన్ ఇంటికి వెళ్లే గేటు వద్ద గుమిగూడి, జనాన్ని చెదరగొట్టేందుకు ప్రయత్నించిన పోలీసులతో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. 
 
పోలీసులకు, యువమోర్చా నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. జగన్ మోహన్ రెడ్డి అధికారికంగా క్షమాపణ చెప్పాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. 
 
కార్యకర్తలు ప్రధాన గేటును బద్దలు కొట్టి వైసీపీ కార్యాలయం వద్దకు వెళ్లి అక్కడ ఎర్రరంగు పూసి గోడలను ధ్వంసం చేశారు. వారు కూడా జగన్ నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించగా, పెద్ద గేటుతో అడ్డుకున్నారు. వైఎస్ జగన్ ఆరోపణలను ఖండిస్తూ.. వీటన్నింటి వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపించారు. దీంతో జగన్ నివాసం వద్ద భద్రతను పెంచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments