Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్యసభలో కేవీపీ ప్రత్యేక హోదాపై ప్రసంగం... సభలో కుర్చీలు ఖాళీ!

Webdunia
సోమవారం, 2 మార్చి 2015 (16:40 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కేవీపీ రామచంద్రరావును కోరారు. గత యూపీఏ ప్రభుత్వ సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. అయితే, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగంలో ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ఎక్కడా కూడా ప్రస్తావించలేదని ఆయన గుర్తు చేశారు. 
 
విభజన చట్టం ఆమోదం సమయంలో విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఏపీ ప్రభుత్వానికి అధికారంలోకి వస్తే అన్ని సమకూర్చుతామని బీజేపీ హామీ ఇచ్చిందని, ఇపుడు ఆ విషయాన్ని మరచిపోయిందని చెప్పారు. ఇపుడు విచిత్రమేమిటంటే... ఏపీ శాసనమండలిలో సభ్యుల సంఖ్య తక్కువగా ఉందని పేర్కొంటూ ఏపీ పునర్‌వ్యవస్థీకరణ బిల్లును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం సభలో ప్రవేశపెట్టారని గుర్తు చేశారు.
 
ఏపీ ప్రజలు కోరుకునేది పదవులు కాదనీ, ప్రత్యేక హోదా, జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం నిర్మాణానికి అవసరమైన నిధులు అని చెప్పారు. అందువల్ల విభజన చట్టం మేరకు ఏపీకి సమకూర్చాలని కోరారు. అంతేకాకుండా, గతంలో తమ పార్టీ చేసిన తప్పు వల్ల ఏపీలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమై పోయిందని ఆయన గుర్తు చేశారు. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే.. కేవీపీ ప్రసంగించే సమయంలో రాజ్యసభలో కుర్చీలన్నీ ఖాళీగా ఉండటం గమనార్హం. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments