Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచి నీటి నల్లా వద్ద ఘర్షణ : బాలింత మృతి

Webdunia
శుక్రవారం, 10 మే 2019 (12:38 IST)
కర్నూలు జిల్లాలో ఓ బాలింత ప్రాణాలు కోల్పోయింది. మంచినీటి నల్లా వద్ద జరిగిన చిన్నపాటి ఘర్షణలో ఆమె చనిపోయింది. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన శుక్రవారం జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కర్నూలు పట్టణంలోని లక్ష్మీనగర్‌కు చెందిన షేక్షావలి, షేకున్‌బీ అనే దంపతుల కుమార్తె మౌలాబీ. ఈమెకు ఐదేళ్ళ క్రితం వివాహం జరిగింది. ఈమె రెండు నెలల క్రితం ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం తర్వాత పుట్టింట్లోనే ఉంటూ వస్తోంది.
 
అయితే, కర్నూలు పట్టణంలో తీవ్రమైన నీటి ఎద్దటి నెలకొనివుంది. దీంతో పట్ణంలోని కాలనీవాసులంతా కుళాయి నీళ్లను వంతుల వారిగా పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో మౌలాబీ నీళ్ల కోసం కుళాయి వద్దకు వెళ్లింది. కుళాయి వద్ద నీరు పట్టుకునే క్రమంలో పక్క గుడిసెలో ఉంటున్న రామచంద్రమ్మతో మాటామాటా పెరిగి గొడవ జరిగింది.
 
పని నుంచి తిరిగి వచ్చిన తల్లికి ఆమె విషయం చెప్పటంతో మళ్లీ గొడవ పెట్టుకుంది. దీంతో రామచంద్రమ్మ కుటుంబసభ్యులు షేకున్‌బీపై దాడి చేశారు. అయితే తల్లిపై దాడిని అడ్డుకునేందుకు వచ్చిన మౌలాబీని రామచంద్రమ్మ కుటుంబసభ్యులు కొట్టి వెనక్కి తోసేశారు. దీంతో కింద పడ్డ మౌలాబీ  తలకు బలమైన గాయం తగలడంతో అపస్మరకస్థితిలోకి జారుకుంది. 
 
ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు రామచంద్రమ్మ, భర్త రత్నమయ్య, కుమార్తె మనీషాలపై పోలీసులు హత్య కేసు నమోదు చేసి నిందితులని అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments