Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీ నుంచి టీడీపీకి బుట్టా రేణుక జంప్? నారా లోకేష్‌ను ఎందుకు కలిశారు..?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ ద్వారా తెలుగుదేశం పార్టీపై, ఆ పార్టీ అధినేత, నాయకులపై దుమ్మెత్తిపోసిన వైకాపా సభ్యులకు పెద్ద షాక్ తగలనుంది. ప్లీనరీ ద్వారా ప్రజల్లో తదుపరి ప్రభుత్వం తమదేనని చెప్పకనే

Webdunia
శనివారం, 15 జులై 2017 (15:44 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ ద్వారా తెలుగుదేశం పార్టీపై, ఆ పార్టీ అధినేత, నాయకులపై దుమ్మెత్తిపోసిన వైకాపా సభ్యులకు పెద్ద షాక్ తగలనుంది. ప్లీనరీ ద్వారా ప్రజల్లో తదుపరి ప్రభుత్వం తమదేనని చెప్పకనే చెప్పిన వైకాపా చీఫ్ జగన్‌కు చెక్ పెట్టేందుకు టీడీపీ రంగం సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా వైకాపాలో వికెట్ పడనుంది. ఇంతకీ విషయం ఏమిటంటే? వైసీపీ కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారని సమాచారం. 
 
హైదరాబాదులో వైసీపీ అధినేత జగన్ అధ్యక్షతన లోటస్ పాండ్‌లో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి రేణుక డుమ్మా కొట్టారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన సమావేశానికి రేణుక హాజరుకాకపోవడంపై అందరూ షాక్ తిన్నారు. అయితే కర్నూలు పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్‌ను బుట్టా రేణుకా కలిశారు. దీంతో ఆమె పార్టీ మారడం ఖాయమని రాజకీయ పండితులు జోస్యం చెప్తున్నారు. 
 
మరోవైపు హైదరాబాదులో శనివారం వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం 30 నిమిషాల్లోనే ముగిసింది. ఈ సందర్భంగా తమ ఎంపీల పని తీరు పట్ల జగన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ముఖ్యంగా ఈ సమావేశానికి హాజరుకాని కర్నూలు ఎంపీ బుట్టా రేణుకపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారట. దీంతోపాటు వ్యక్తిగత ప్రయోజనాల కోసం పాకులాడటం పక్కనబెట్టి.. ప్రజా సేవలో మమేకం కావాలని ఎంపీలకు జగన్ హితవు పలికినట్లు తెలుస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments