Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలు ఉయ్యాలవాడలో పీఎం వాణి సేవలు

Webdunia
సోమవారం, 11 అక్టోబరు 2021 (11:33 IST)
ఏపీలోని కర్నూలు జిల్లా ఉయ్యాలవాడలో పీఎం (ప్రధానమంత్రి వైఫై యాక్సెస్ నెట్‌వర్క్ ఇంటర్‌ఫేస్) సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీనిపై ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ, త్యాగానికి ప్రతి రూపంగా నిలిచిన బుడ్డా వెంగళరెడ్డి, నరసింహారెడ్డి వంటి మహనీయులు జన్మించిన ఉయ్యాలవాడకు ‘పీఎం వాణి సేవలు' రావడం హర్షణీయమన్నారు. 
 
దేశంలో ప్రతి పల్లెను స్మార్ట్‌ విలేజ్‌గా మార్చాలనే సంకల్పంతో కేంద్రం చేపట్టిన పీఎం-వాణి గ్రామ యూనిట్‌గా ప్రారంభిస్తున్నారు. అందులో భాగంగా కర్నూలు జిల్లా ఉయ్యాలవాడలో ఆదివారం ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, శాసనమండలిలో విప్‌ గంగుల ప్రభాకరరెడ్డి, ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రరెడ్డితో కలిసి బుగ్గన ఈ సేవలను ప్రారంభించారు. 
 
అనంతరం మంత్రి మాట్లాడుతూ స్మార్ట్‌ గ్రామంగా అవతరించిన ఉయ్యాలవాడ అందరికీ మార్గదర్శకం కావాలన్నారు. చిన్న వ్యాపారులు వైఫై ద్వారా అదనపు ఆదాయం పొందొచ్చు అన్నారు. గంగుల ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ సి-డాట్‌, వైడాట్‌ సంయుక్తంగా నిర్వహించే ఈ సేవలు గతంలో వాడే టెలిఫోన్‌, పబ్లిక్‌ బూత్‌ తరహాలో ఉంటాయన్నారు. కార్యక్రమంలో పీఎం వాణి సీఈవో సంజీవ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments