Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలు ఉయ్యాలవాడలో పీఎం వాణి సేవలు

Webdunia
సోమవారం, 11 అక్టోబరు 2021 (11:33 IST)
ఏపీలోని కర్నూలు జిల్లా ఉయ్యాలవాడలో పీఎం (ప్రధానమంత్రి వైఫై యాక్సెస్ నెట్‌వర్క్ ఇంటర్‌ఫేస్) సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీనిపై ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ, త్యాగానికి ప్రతి రూపంగా నిలిచిన బుడ్డా వెంగళరెడ్డి, నరసింహారెడ్డి వంటి మహనీయులు జన్మించిన ఉయ్యాలవాడకు ‘పీఎం వాణి సేవలు' రావడం హర్షణీయమన్నారు. 
 
దేశంలో ప్రతి పల్లెను స్మార్ట్‌ విలేజ్‌గా మార్చాలనే సంకల్పంతో కేంద్రం చేపట్టిన పీఎం-వాణి గ్రామ యూనిట్‌గా ప్రారంభిస్తున్నారు. అందులో భాగంగా కర్నూలు జిల్లా ఉయ్యాలవాడలో ఆదివారం ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, శాసనమండలిలో విప్‌ గంగుల ప్రభాకరరెడ్డి, ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రరెడ్డితో కలిసి బుగ్గన ఈ సేవలను ప్రారంభించారు. 
 
అనంతరం మంత్రి మాట్లాడుతూ స్మార్ట్‌ గ్రామంగా అవతరించిన ఉయ్యాలవాడ అందరికీ మార్గదర్శకం కావాలన్నారు. చిన్న వ్యాపారులు వైఫై ద్వారా అదనపు ఆదాయం పొందొచ్చు అన్నారు. గంగుల ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ సి-డాట్‌, వైడాట్‌ సంయుక్తంగా నిర్వహించే ఈ సేవలు గతంలో వాడే టెలిఫోన్‌, పబ్లిక్‌ బూత్‌ తరహాలో ఉంటాయన్నారు. కార్యక్రమంలో పీఎం వాణి సీఈవో సంజీవ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments