క్రిష్ణానది ప్రమాదంపై కన్నీరు పెట్టుకున్న సిఎం బాబు, విలపించిన నారాయణ

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు క్రిష్ణానది వద్ద జరిగిన పడవ బోల్తా ప్రాంతానికి చేరుకున్నారు. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పర్యాటక శాఖ అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. రివర్ బోటింగ్ అడ్వంచర్ సంస్థకు అనుమతి లే

Webdunia
సోమవారం, 13 నవంబరు 2017 (14:36 IST)
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు క్రిష్ణానది వద్ద జరిగిన పడవ బోల్తా ప్రాంతానికి చేరుకున్నారు. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పర్యాటక శాఖ అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. రివర్ బోటింగ్ అడ్వంచర్ సంస్థకు అనుమతి లేకపోయినా పడవను నడుపుకునేందుకు ఎవరు అనుమతి ఇచ్చారని పర్యాటక శాఖ అధికారులను ప్రశ్నించారు.
 
పర్యాటక శాఖ అధికారులు ఎవరైనా ఆ ప్రైవేటు సంస్థకు సహకరించారేమో విచారణ చేసి, ఒకవేళ అలాంటిదే జరిగితే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు ముఖ్యమంత్రి. గల్లంతైన 9 మంది ఆచూకీ కోసం బంధువులు పడుతున్న ఆర్తనాదాలను చూసి బాబు చలించిపోయారు. కళ్ళ వెంట కన్నీరు పెట్టుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి. 
 
బోరున విలపించిన సిపిఐ నారాయణ 
క్రిష్ణానది పడవ బోల్తా ప్రమాదంపై సిపిఐ జాతీయ నేత నారాయణ కన్నీటి పర్యంతమయ్యారు. తమ బంధువుల ఆ ప్రమాదంలో మరణించడంతో ఆయన తీవ్ర ఆవేదనకు గురయ్యారు. పడవ ప్రమాదంలో బావమరిది పాపారావు భార్య లలిత మరణించడంతో పాటు పాపారావు కోడలు హరిత, మనవరాలు అశ్వికల మృతదేహాలు కనిపించకుండా పోయాయి. దీంతో నారాయణ కుటుంబం మొత్తం విషాదంలోకి వెళ్ళిపోయింది. 
 
జరిగిన సంఘటనపై తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేసిన నారాయణ, గల్లంతైన మృతదేహాలను త్వరగా ప్రభుత్వం బంధువులకు అప్పజెప్పాలని కోరారు. అలాగే రివర్ బోటింగ్ అడ్వంచర్ సంస్థపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నారాయణ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika Mandanna: ది గర్ల్ ఫ్రెండ్ నుంచి కురిసే వాన.. లిరికల్ సాంగ్ రిలీజ్

Rohit Nara:.నటి సిరి లెల్లాతో రోహిత్ నారా వివాహం హైదరాబాద్ లో జరిగింది

Malavika Nair: శర్వా.. బైకర్ ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ థియేటర్లలో స్క్రీనింగ్

Thaman: బాలకృష్ణ.. అఖండ 2: తాండవం బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం సర్వేపల్లి సిస్టర్స్

Dulquer : దుల్కర్ సల్మాన్.. కాంత నుంచి రాప్ ఆంథమ్ రేజ్ ఆఫ్ కాంత రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments