Webdunia - Bharat's app for daily news and videos

Install App

నూజివీడులో కరోనా వైరస్ : జూన్ 8 వరకు లాక్డౌన్ పొడగింపు...

Webdunia
మంగళవారం, 12 మే 2020 (11:41 IST)
కృష్ణా జిల్లా నూజివీడులో కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో ఈ ప్రాంతంలో లాక్డౌన్‌ను వచ్చే నెల ఎనిమిదో తేదీ వరకు పొడగించారు. ఈ మేరకు తాహసీల్దారు ఎం. సురేష్ కుమార్ ఆదేశాలు జారీచేశారు. 
 
స్థానిక మైలవరం రోడ్డుకు చెందిన ఓ మహిళకు నూజివీడు ఆసుపత్రిలో నిర్వహించిన వైరస్ నిర్ధారణ పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో పూర్తిస్థాయిలో నిర్ధారించుకునేందుకు ఆమె నుంచి మరిన్ని శాంపిల్స్ సేకరించి విజయవాడ పంపించారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లోనూ కరోనా పాజిటివ్ అని తేలింది. 
 
దీంతో సోమవారం నుంచి 28 రోజుల పాటు.. అంటే జూన్ 8వ తేదీ వరకు నూజివీడు పట్టణంలో లాక్డౌన్ కొనసాగుతుందని తాహసీల్దారు వెల్లడించారు. రోడ్‌‌జోన్‌లో తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు మాత్రమే కూరగాయలు, నిత్యావసర దుకాణాలు తెరవాలని ఆయన ఆదేశించారు. కాగా, ఇప్పటికే కృష్ణలంక భ్రమరాంబపురంలోని సతీశ్ కుమార్ రోడ్డులో ఓ పాజిటివ్ కేసు ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments