జస్ట్ ఒక్క పాయింటుతో చేజారిపోయింది... చంద్రబాబు నాయుడు ట్వీట్

Webdunia
శనివారం, 24 ఆగస్టు 2019 (19:39 IST)
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న నత్తనడక పనులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ట్విట్టర్ వేదికగా ఇలా పేర్కొన్నారు. ''నీరు-చెట్టు కార్యక్రమం గురించి అవగాహనలేని వైసీపీ వాళ్ళంతా నానారకాలుగా మాట్లాడారు. ఈరోజు ఇదే కార్యక్రమానికి దేశమంతా ప్రశంసలు వస్తున్నాయి. మా పాలనలో సమర్ధ నీటి నిర్వహణ వలన నీతి ఆయోగ్ ఏపీకి జాతీయ స్థాయిలో రెండో ర్యాంకును ఇచ్చింది. కేవలం ఒక పాయింటు దూరంలో మొదటి ర్యాంకు పోయింది.
 
విపత్తు నిర్వహణ చేతకాకపోతే ఇంక ప్రభుత్వాలెందుకు? హుద్ హుద్ తుఫాన్ లో 240కి.మీ వేగంతో ఈదురుగాలులు, భారీ వర్షాలతో విశాఖ వణికింది, తిత్లి తుఫాన్ లో 180కి.మీ వేగంతో ఈదురుగాలులు, భారీ వర్షాలతో శ్రీకాకుళం అల్లాడింది.. ముందస్తు హెచ్చరికలతో ప్రజలను అప్రమత్తం చేశాం.
 
గంటల వ్యవధిలోనే పునరావాస, సహాయ చర్యలతో బాధితులను ఆదుకున్నాం. వేలాదిమందికి ప్రతిరోజూ భోజనాలు, నాణ్యమైన నిత్యావసరాల పంపిణీ చేశాం.. నేలకూలిన లక్షలాది చెట్లను తొలగించాం, విరిగిపడిన వేలాది కరెంట్ స్తంభాలను పునరుద్దరించాం. ఆ స్ఫూర్తి ఇప్పుడీ కృష్ణా, గోదావరి వరదల్లో ఏమైంది?'' అని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర డియోల్ ఇకలేరు

వంద కోట్ల మార్కులో వరుసగా మూడు చిత్రాలు.. హీరో ప్రదీప్ రంగనాథన్ అదుర్స్

ధనుష్, మృణాల్ ఠాకూర్ డేటింగ్ పుకార్లు.. కారణం ఏంటంటే?

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments