Webdunia - Bharat's app for daily news and videos

Install App

జస్ట్ ఒక్క పాయింటుతో చేజారిపోయింది... చంద్రబాబు నాయుడు ట్వీట్

Webdunia
శనివారం, 24 ఆగస్టు 2019 (19:39 IST)
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న నత్తనడక పనులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ట్విట్టర్ వేదికగా ఇలా పేర్కొన్నారు. ''నీరు-చెట్టు కార్యక్రమం గురించి అవగాహనలేని వైసీపీ వాళ్ళంతా నానారకాలుగా మాట్లాడారు. ఈరోజు ఇదే కార్యక్రమానికి దేశమంతా ప్రశంసలు వస్తున్నాయి. మా పాలనలో సమర్ధ నీటి నిర్వహణ వలన నీతి ఆయోగ్ ఏపీకి జాతీయ స్థాయిలో రెండో ర్యాంకును ఇచ్చింది. కేవలం ఒక పాయింటు దూరంలో మొదటి ర్యాంకు పోయింది.
 
విపత్తు నిర్వహణ చేతకాకపోతే ఇంక ప్రభుత్వాలెందుకు? హుద్ హుద్ తుఫాన్ లో 240కి.మీ వేగంతో ఈదురుగాలులు, భారీ వర్షాలతో విశాఖ వణికింది, తిత్లి తుఫాన్ లో 180కి.మీ వేగంతో ఈదురుగాలులు, భారీ వర్షాలతో శ్రీకాకుళం అల్లాడింది.. ముందస్తు హెచ్చరికలతో ప్రజలను అప్రమత్తం చేశాం.
 
గంటల వ్యవధిలోనే పునరావాస, సహాయ చర్యలతో బాధితులను ఆదుకున్నాం. వేలాదిమందికి ప్రతిరోజూ భోజనాలు, నాణ్యమైన నిత్యావసరాల పంపిణీ చేశాం.. నేలకూలిన లక్షలాది చెట్లను తొలగించాం, విరిగిపడిన వేలాది కరెంట్ స్తంభాలను పునరుద్దరించాం. ఆ స్ఫూర్తి ఇప్పుడీ కృష్ణా, గోదావరి వరదల్లో ఏమైంది?'' అని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments