Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా దెబ్బకు ఆర్ఎంవో మృతి.. వైరస్ నుంచి కోలుకున్న ఎమ్మెల్యే అంబటి

Webdunia
శుక్రవారం, 31 జులై 2020 (11:49 IST)
కృష్ణా జిల్లాలోని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్‌ఎంవోగా పనిచేస్తున్న ప్రముఖ వైద్యుడు డాక్టర్ యోగేంద్రబాబు (59) కరోనా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయారు. ఈయనకు 15 రోజుల క్రితం ఆయనకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో వెంటనే ఆయనను విజయవాడలోని కొవిడ్ కేర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వచ్చిన ఆ.న... కోలుకుంటున్నట్టే కనిపించారు. కానీ, బుధవారం రాత్రి ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి విషమించడంతో గురువారం తుదిశ్వాస విడిచినట్టు వైద్యాధికారులు వెల్లడించారు. 
 
ఇదిలావుంటే, ఇటీవల కరోనా వైరస్ బారినపడిన వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కోలుకుని, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయం స్వయంగా ఆయనే వెల్లడించారు. 'మీ అందరి ఆశీస్సుల వల్ల కోలుకున్నాను. కరోనా సోకడంతో 10 రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకుని నెగెటివ్ రావడంతో డిశ్చార్జి అయ్యి ఈరోజే ఇంటికి వచ్చాను. అయితే ఓ వారం పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని డాక్టర్లు సలహా ఇచ్చారు. నేను కోలుకోవాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు' అంటూ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments