Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాశర్లపూడిలో కోనసీమ జలవిహారి బోటు

Webdunia
శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (10:55 IST)
తూర్పుగోదావరి జిల్లా వైనతేయ నదిలో అందాలను ఆస్వాదించడానికి పాశర్లపూడిలో రూ.1.20 కోట్లతో కోనసీమ జలవిహారి బోటును పర్యాటకుల కోసం ఏర్పాటుచేశారు. పాశర్లపూడిలో నిర్మించిన బోటింగ్‌ పాయింట్‌ వద్ద ఈ కోనసీమ జలవిహారి బోటును ప్రారంభించారు.

30 మంది పర్యాటకులు కూర్చుని ప్రయాణించే విధంగా సీట్లు ఏర్పాటు చేసి, ఏసీతోపాటు ప్రయాణికుల రక్షణ కోసం వివిధ రకాల ఏర్పాట్లు చేశారు. బోటింగ్‌ పాయింట్‌ నుంచి ఆదుర్రు ఆది బౌద్ధ స్థూపం వరకు షికారు చేసేందుకు ఒక ప్యాకేజిను, అప్పనపల్లి బాలబాలాజీస్వామి ఆలయం వరకు మరో ప్యాకేజిను అందుబాటులోకి తెచ్చారు.

అంతేకాకుండా వైనతేయ నది పరిసర ప్రాంతాల్లో పదిహేను నిమిషాలు విహరించేలా మూడో ప్యాకేజిని ఏర్పాటు చేసినట్టు ఏపీ టూరిజం ఏఈ వై.సత్యనారాయణ తెలిపారు.

మొదటి ప్యాకేజిలో రెండు గంటల విహారానికి రూ.8,260, రెండో ప్యాకేజిలో మూడు గంటలకు రూ.10,620, మూడో ప్యాకేజిలో పదిహేను నిమిషాలకు గాను మనిషికి రూ.90 ధరగా నిర్థారించినట్టు తెలిపారు.

ఈ పాయింటు వద్ద స్పీడు బోట్లను త్వరలో ఏర్పాటు చేస్తామని, ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నట్టు ఏఈ తెలియజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments