Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుండీ ఇచ్చి చొక్కా కొట్టేసినట్లు, విద్యా కానుక ఎర వేసి పిల్లల బడులు కొట్టేశాడు.

Webdunia
బుధవారం, 6 జులై 2022 (16:51 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మరోమారు విమర్శలు గుప్పించారు. పాఠశాలల విలీనం పేరుతో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక పాఠశాలలను మూసివేస్తున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. బడులు ప్రారంభంకావడంతో తమ ప్రాంతంలోని స్కూల్ మూసివేసినట్టు తెలియగానే వారు మండిపడుతూ ఆందోళనకు దిగుతున్నారు. 
 
దీనిపై అచ్చెన్నాయుడు ట్వీట్ల వర్షం కురిపించారు. "జగన్ రెడ్డి పంట బీమా బటన్ నొక్కగానే రైతులు రోడ్డున పడ్డారు.. విద్యా కానుక బటన్ నొక్కగానే పసి పిల్లలు రోడ్డున పడ్డారు.. ఇస్తున్నాను అని ఏదన్నా బటన్ నొక్కాడు అంటే దాని వెనుక ప్రజలకు తెలియకుండా లాక్కునే బటన్లు ముందే నొక్కేసాడు అని అర్థం. 
 
3,4,5 తరగతులను ఉన్నత విద్య పాఠశాలల విలీనం పేరుతో, రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళ సంఖ్యను తగ్గించి వేస్తున్నారు. తద్వారా టీచర్ల నోటిఫికేషన్లు కూడా తగ్గించబడతాయి. ముఖ్యంగా పాఠశాలల భూములపై ఈ గద్దలు కన్నేశారు. విలీనం పేరుతో పసి పిల్లలను కిలోమీటర్ల మేర నడిపిస్తూ కష్ట పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? గుండీ ఇచ్చి చొక్కా కొట్టేసినట్లు, విద్యా కానుక ఎర వేసి పిల్లల బడులు కొట్టేశాడు అంటూ విమర్శలు గుప్పించారు. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments