Webdunia - Bharat's app for daily news and videos

Install App

వదినతో మరిది రొమాన్స్... పిల్లలు అడ్డుగా ఉన్నారనీ...

పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంలో ఇద్దరు చిన్నారుల అనుమానాస్పద మృతి కేసులో ఉన్న చిక్కుముడి వీడిపోయింది. ఈ చిన్నారుల తల్లితో ఆమె మరిది వివాహేతర సంబంధమే ఈ చిన్నారుల హత్యకు కారణమని తేలింది.

Webdunia
బుధవారం, 26 జులై 2017 (08:49 IST)
పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంలో ఇద్దరు చిన్నారుల అనుమానాస్పద మృతి కేసులో ఉన్న చిక్కుముడి వీడిపోయింది. ఈ చిన్నారుల తల్లితో ఆమె మరిది వివాహేతర సంబంధమే ఈ చిన్నారుల హత్యకు కారణమని తేలింది. వదినతో తాను అనుకున్నపుడు ఏకాంతంగా గడిపేందుకు చిన్నారుల వల్ల వీలుపడక పోవడంతో ఇద్దరు చిన్నారుల అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసి వారిద్దరినీ కాలువలో తోసేసి చంపేసినట్టు పోలీసులు విచారణలో తేలింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
జిల్లాలోని దిప్పకాయలపాడు గ్రామానికి చెందిన కైకరపు చిన్నారావు, మంగ దంపతుల కుమారులైన ప్రశాంత్‌(10), విక్కీ(8) ఆదివారం ఉదయం పాలు తేవడానికి వెళ్లారు. అయితే, ఇద్దరినీ అదే గ్రామానికి చెందిన వరసకు బాబాయ్‌ అయిన కైకరపు రవిశేఖర్‌ ఆదివారం ఉదయం మోటార్‌ సైకిల్‌ పై ఎక్కించుకుని పోలవరం వైపునకు తీసుకెళ్లినట్టు తెలిసింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించగా, అసలు విషయం తెలిసింది. 
 
చిన్నారుల తల్లి మంగతో తనకు వివాహేతర సంబంధం ఉందనీ, ఆమెతో తాను అనుకున్నప్పుడల్లా ఏకాంతంగా గడిపేందుకు చిన్నారులు అడ్డుగా ఉండటంతో వారిని అడ్డుతొలగించుకునే క్రమంలో నీటి కాలువలో తోసేసి హత్య చేసినట్టు నేరాన్ని అంగీకరించాడు. దీంతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు విచారిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments