Webdunia - Bharat's app for daily news and videos

Install App

NCERT కీలక నిర్ణయం... బ్యాగు బరువు తగ్గించడమే లక్ష్యం..

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2022 (13:36 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (NCERT) కీలక నిర్ణయాలు తీసుకుంది. ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు హోం వర్క్ ఇవ్వొద్దని ఆదేశాలను జారీ చేసింది. ఇంకా.. 3, 4, 5 తరగతుల విద్యార్థులకు సంబంధించి వర్క్ బుక్ లను స్కూల్స్ లోనే ఉంచాలని వెల్లడించింది. 
 
విద్యార్థుల బుక్స్ బ్యాగు బరువును తగ్గించడమే లక్ష్యంగా ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు సంబంధించి మాథ్స్ కు ఒక నోట్ బుక్, మిగతా అన్ని సబ్జెక్టులకు సంబంధించి మరో నోట్ బుక్ మాత్రమే నిర్వహించాలంటూ స్పష్టం చేసింది. 
 
ఇంకా హైస్కూల్ కు సంబంధించి లాంగ్ నోట్ బుక్ ను రెండు సబ్జెక్టులకు కేటాయించుకునేలా విద్యార్థులకు పర్మిషన్ ఇవ్వాలని సూచించింది. ఇంకా ఉపాధ్యాయులు బోధించే సబ్జెక్టుల వివరాలను విద్యార్థులకు చెప్పి ఏ రోజుకు అవసరమైన పుస్తకాలు ఆ రోజే తీసుకువచ్చేలా చూడాలని నిర్వాహకులకు స్పష్టం చేశారు. 
 
పుస్తకాలను స్కూల్ లోనే దాచుకునే సదుపాయం కల్పించాలని పేర్కొన్నారు. ఏ తరగతి విద్యార్థులకు స్కూల్ బ్యాక్ ఎంత మేరకు బరువు ఉండాలనే అంశంపై సైతం స్పష్టత ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments