Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగనన్నా.. నువ్వు.. నీ ముఠా ఒక్క అంగుళం కూడా కదల్చలేరు : కేశినేని

Webdunia
మంగళవారం, 28 జనవరి 2020 (11:52 IST)
ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విజయవాడ ఎంపీ, టీడీపీ నేత కేశినేని నాని సైటెర్లు వేశారు. జగన్ అన్నా... నీవు, నీ ముఠా కలిసి రాజధాని అమరావతిని అంగుళం కూడా కదల్చలేరన్నా అంటూ జోస్యం చెప్పారు. ఏపీ అసెంబ్లీలో శాసనమండలిని రద్దు చేస్తూ తీర్మానం చేయగా, దీనిపై కేశినేని నాని స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ శాసన మండలి రద్దు అవ్వదు జగన్ రెడ్డి గారూ అంటూ కేశినేని ట్వీట్ చేశారు. 
 
శాసన మండలిని రద్దు చేస్తూ ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని కేంద్ర న్యాయశాఖ ముందుకు తీసుకువెళ్లే అవకాశమే లేదన్నారు. ఇటువంటి తీర్మానాలను తప్పుబడుతూ రాజ్యసభ స్థాయీ సంఘం ఓ నివేదిక సమర్పించిందని, దాన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టారని ఆయన గుర్తుచేశారు. 
 
ఈ పరిస్థితుల్లో న్యాయ శాఖ మళ్లీ రాష్ట్రానికి సంబంధించిన తీర్మానాన్ని చేపట్టి పార్లమెంటుకు పంపదని చెప్పారు. అంతేకాదు జగన్ అన్నా... నువ్వూ నీ ముఠా అమరావతి నుండి రాజధానిని ఒక అంగుళం కూడా కదల్చలేరు. హైకోర్టు‌ను అమరావతి నుండి మార్చలేరు. శాసన మండలిని రద్దు చెయ్యాలనే మీ ప్రతిపాదన జరిగే పని కాదు. మీ వల్ల ఏదీ కాదు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannah: మైసూర్ శాండల్ సోప్ అంబాసిడర్‌గా తమన్నా.. కన్నడ హీరోయిన్లు లేరా?

Mega Heros: మెగా హీరోలకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను : విజయ్ కనకమేడల

Yash; రామాయణంలో రామ్‌గా రణబీర్ కపూర్, రావణ్‌గా యష్ షూటింగ్ కొనసాగుతోంది

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటికి పిలిస్తేనే వచ్చాను.. పార్టీలో కలిశాను.. ఇషా

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments