Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా మనిషిని టీటీడీలో ఏజెంటుగా నియమించండి: ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమార్తి సిఫార్సు!

Webdunia
శుక్రవారం, 28 నవంబరు 2014 (12:23 IST)
తిరుమల తిరుపతి దేవస్థానంలో తనకు బాగా కావాల్సిన వ్యక్తికి చోటు కల్పించాలని కోరుతూ ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తి రాసిన సిఫార్సు లేఖ ఇపుడు టీటీడీలో కలకలం రేపుతోంది. ఈ లేఖపై ఎలా స్పందించాలో తెలియకు తితిదే అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 
 
టీటీడీలో సామాన్య భక్తులకు సేవలందించే ఏజెంటుగా తన మనిషి నందకుమార్‌కు అవకాశం కల్పించాలని ఉప ముఖ్యమంత్రి అధికారులకు లేఖ రాశారు. ఏజెంట్ల నియామకం కోసం ఏకంగా మంత్రులు సిఫారసు లేఖలు పంపుతుండటంపై అధికారులు ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న విషయాలకు కూడా మంత్రుల స్థాయి నుంచి సిఫారసులు వెల్లువెత్తితే పని చేయడమెలాగంటూ వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
 
మరోవైపు.. పదేళ్ళ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో తితిదేకి వచ్చే సిఫార్సు లేఖల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. వీఐపీ దర్శనాల కోసం ప్రజా ప్రతినిధులు చేస్తున్న సిఫారసులను అమలు చేయలేక టీటీడీ అధికార యంత్రాంగం తలలు పట్టుకుంటోంది. ఈ కోవలోనే తాజాగా ఏపీ రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తి చేసిన సిఫారసు లేఖ కూడా టీటీడీలో కలకలం రేపుతోంది. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments