ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. తమకు ముందు చూపు లేదని చంద్రబాబు ఆరోపిస్తున్నారని... తమకు ముందుచూపు ఉందని, చంద్రబాబులా దొంగచూపు లేదని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. అవశేషాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్ద ఎత్తున అసత్యాలు ప్రచారం చేస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు.
ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన విద్యుత్తులో కోత విధిస్తున్నారని కేసీఆర్ అన్నారు. కృష్ణపట్నం ప్లాంట్ నుంచి తెలంగాణకు విద్యుత్ సరఫరా చేయమని చంద్రబాబు అంటున్నారని... అదేమైనా ఆయన బాబు జాగీరా? అంటూ మండిపడ్డారు. అది రెండు రాష్ట్రాల జాయింట్ వెంచర్ అని చెప్పారు.
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాలకు చంద్రబాబు తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. కరెంటు విషయంలో చంద్రబాబు చెబుతున్నవన్నీ అసత్యాలే అని చెప్పారు. కరెంట్ విషయంపై సుప్రీంకోర్టుకు వెళతామని... సంగతేందో చూస్తామని చెప్పారు.