Webdunia - Bharat's app for daily news and videos

Install App

కత్తి మహేష్‌ను తెలంగాణ పోలీసులు చిత్తూరులో వదిలేశారు... మరిప్పుడు ఏపీ పోలీసులు ఏం చేస్తారో?

వివాదాలకు కేరాఫ్ అడ్రెస్‌గా ఈమధ్య కాలంలో మారిపోయిన కత్తి మహేష్‌ను తెలంగాణ పోలీసులు చక్కగా తోడ్కొని వచ్చి ఆయన స్వస్థలం చిత్తూరులో వదిలిపెట్టి వెళ్లారు. మరో ఆరు నెలల పాటు హైదరాబాదులో అడుగుపెట్టకూడదని తెలియజెప్పారు. దీనికి దారితీసిన పరిస్థితులు ఏమిటంటే.

Webdunia
సోమవారం, 9 జులై 2018 (21:42 IST)
వివాదాలకు కేరాఫ్ అడ్రెస్‌గా ఈమధ్య కాలంలో మారిపోయిన కత్తి మహేష్‌ను తెలంగాణ పోలీసులు చక్కగా తోడ్కొని వచ్చి ఆయన స్వస్థలం చిత్తూరులో వదిలిపెట్టి వెళ్లారు. మరో ఆరు నెలల పాటు హైదరాబాదులో అడుగుపెట్టకూడదని తెలియజెప్పారు. దీనికి దారితీసిన పరిస్థితులు ఏమిటంటే... సినీ విమర్శకుడు కత్తి మహేష్ కోట్లాది మంది హిందువుల మనోభావాలు కించపరిచేలా శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. అదేసమయంలో కత్తి మహేష్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా స్వామి పరిపూర్ణానంద స్వామి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. దీన్ని పోలీసులు అడ్డుకుని, ఆయన్ను గృహనిర్బంధం చేశారు.
 
మరోవైపు కత్తి మహేష్‌పైన హైదరాబాద్ నగర బహిష్కరణ వేటువేశారు. ఆర్నెల్లపాటు నగరంలో అడుగుపెడితే మూడేళ్ళ జైలుశిక్ష తప్పదని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి హెచ్చరించారు. భావవ్యక్తీకరణ ప్రాథమిక హక్కే అయినప్పటికీ... ఇష్టానుసారం మాట్లాడుతూ, సమాజంలో ఉద్రిక్తతలకు కారణమయ్యేవారిని ఉపేక్షించబోమని, కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 
 
ఎవరైనాసరే ఎదుటి వ్యక్తుల మనోభావాలను కించపరిచేలా మాట్లాడితే, చర్యలు తీసుకుంటామన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న సినీ క్రిటిక్ కత్తి మహేష్‌ను ఆర్నెల్ల పాటు హైదరాబాద్ నగరం నుంచి బహిష్కరిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ నుంచి ఆయనను తీసుకెళ్లి, ఆయన స్వస్థలమైన చిత్తూరు జిల్లాలో విడిచి పెట్టేందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఈ ఆరు నెలల్లో కత్తి మహేష్ హైదరాబాదులో అడుగుపెట్టేందుకు యత్నిస్తే... అది నేరమవుతుందని, అదే జరిగితే మూడేళ్ల జైలు శిక్షకు ఆయన అర్హులవుతారని డీజీపీ వివరించారు. 
 
ఏ రాష్ట్రానికి చెందినవారైనా హైదరాబాదులో ప్రశాతంగా బతకొచ్చని... కానీ, సమాజంలో ఉద్రిక్తతలకు కారణమయ్యేలా ఎవరు ప్రవర్తించినా ఊరుకోబోమన్నారు. ఇలాంటి వ్యక్తులకు సహకరించే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇలాంటి వార్తలకు ఎక్కువ ప్రచారం కల్పించరాదని మీడియాను కోరుతున్నామని తెలిపారు.
 
గత నాలుగేళ్లుగా తెలంగాణలో శాంతిభద్రతలు బాగున్నాయని... ఇకపై కూడా రాష్ట్రం శాంతియుతంగానే ఉండాలన్నదే తమ ఆకాంక్ష అని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్నవారు అవుతారన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా... రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని డీజీపీ మహేందర్ రెడ్డి కోరారు.
 
చిత్తూరులో కత్తి మహేష్‌ను వదిలిపెట్టారు సరే... మరి ఇక్కడ ఆందోళన చేస్తున్నవారి దెబ్బకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకవైపు సమంతకు రెండో పెళ్లి.. మరోవైపు చైతూ-శామ్ ఆ బిడ్డకు తల్లిదండ్రులు.. ఎలా?

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments