Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళ్యాణదుర్గం పీఎస్‌లో బాబు - లోకేశ్‌లపై కేసు నమోదు

Webdunia
సోమవారం, 18 ఏప్రియల్ 2022 (18:09 IST)
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పోలీస్ స్టేషనులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లపై కేసు నమోదు చేశారు. 
 
కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్‌కు ఇటీవల మంత్రిపదవి వరించింది. ఏపీ సీఎం జగన్ చేపట్టిన పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఆమెకు లక్కీ ఛాన్స్ వరించింది. ఆ తర్వాత ఆమె బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి కళ్యాణదుర్గంకు వచ్చారు. 
 
ఈ సందర్భంగా ఆమెకు నియోజకవర్గ వైకాపా శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు. దీంతో పోలీసులు ట్రాఫిక్‌‌ను మళ్లించారు. అదేసమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర జాప్యం జరిగింది. దీంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. 
 
అయితే, మంత్రి పర్యటన సందర్భంగా పోలీసులు ట్రాఫిక్‌ను నిలిపివేయడం వల్లే ఆస్పత్రికి తీసుకెళుతున్న చిన్నారి ట్రాఫిక్‌లో చిక్కుకుని మృత్యువాతపడినట్టు వార్తలు వచ్చాయి. ఈ ఘటనపై చంద్రబాబు, లోకేశ్‌లు తమతమ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. వీరిద్దరూ అసత్యాలతో కూడిన పోస్టులు పెట్టారంటూ కళ్యాణదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments