Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళ్యాణదుర్గం పీఎస్‌లో బాబు - లోకేశ్‌లపై కేసు నమోదు

Webdunia
సోమవారం, 18 ఏప్రియల్ 2022 (18:09 IST)
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పోలీస్ స్టేషనులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లపై కేసు నమోదు చేశారు. 
 
కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్‌కు ఇటీవల మంత్రిపదవి వరించింది. ఏపీ సీఎం జగన్ చేపట్టిన పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఆమెకు లక్కీ ఛాన్స్ వరించింది. ఆ తర్వాత ఆమె బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి కళ్యాణదుర్గంకు వచ్చారు. 
 
ఈ సందర్భంగా ఆమెకు నియోజకవర్గ వైకాపా శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు. దీంతో పోలీసులు ట్రాఫిక్‌‌ను మళ్లించారు. అదేసమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర జాప్యం జరిగింది. దీంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. 
 
అయితే, మంత్రి పర్యటన సందర్భంగా పోలీసులు ట్రాఫిక్‌ను నిలిపివేయడం వల్లే ఆస్పత్రికి తీసుకెళుతున్న చిన్నారి ట్రాఫిక్‌లో చిక్కుకుని మృత్యువాతపడినట్టు వార్తలు వచ్చాయి. ఈ ఘటనపై చంద్రబాబు, లోకేశ్‌లు తమతమ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. వీరిద్దరూ అసత్యాలతో కూడిన పోస్టులు పెట్టారంటూ కళ్యాణదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments