Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇన్‌స్టాగ్రామ్‌లో అక్కకు పెట్టిన మెసేజ్ ఆధారంగా గుర్తింపు!! తేజస్వి ఆచూకీ తెలిసిందిలా...

వరుణ్
బుధవారం, 3 జులై 2024 (15:30 IST)
కొన్నినెలల క్రితం అదృశ్యమైన తేజశ్విని అనే యువతి ఆచూకీని కాకినాడ పోలీసులు గుర్తించారు. తన ప్రియుడి మొబైల్ ఫోను నుంచి అక్క ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు ఆ యువతి పెట్టిన ఓ మెసేజ్ ఆ యువతి ఆచూకిని పోలీసులు కనిపెట్టేలా చేసింది. ఈ వివరాలను పరిశీలిస్తే, భీమవరం పట్టణానికి చెందిన ప్రభాకర్రావు, శివకుమారి దంపతులకు ఇద్దరు సంతానం. చిన్నమ్మాయి తేజస్విని విజయవాడలో తమ పెద్దమ్మ ఇంట్లో ఉంటూ మాచవరంలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదువుతోంది. అదే కళాశాల సీనియర్ విద్యార్థి, విజయవాడ శివారు నిడమానూరుకు చెందిన అంజాద్ అలియాస్ షన్ను ప్రేమ పేరుతో తేజస్వినిని లోబరుచుకున్నాడు. గతేడాది అక్టోబర్ 28న రాత్రి వీరిద్దరూ హైదరాబాద్ వెళ్లారు. 
 
అక్కడ పలు ప్రాంతాల్లో తిరిగి డబ్బుల్లేక ఫోన్లు, నగలు అమ్మేశారు. తర్వాత కేరళ, ముంబై, ఢిల్లీలో తిరుగుతూ చివరకు జమ్మూకాశ్మీర్‌కు చేరారు. అక్కడ హోటల్లో అంజాద్ పనికి కుదిరాడు. ఇతరులతో మాట్లాడేందుకు తేజస్వినికి ఫోన్ ఇచ్చేవాడు కాదు. ఓ రోజు అంజాద్ లేని సమయంలో అతని ఫోన్ నుంచే తేజస్విని తన అక్కకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పెట్టింది. ఈ చిన్న ఆధారం ద్వారా వివరాలు రాబట్టిన పోలీసులు.. వారు జమ్మూలో ఉన్నట్లు గుర్తించారు. చిరునామాను అక్కడి పోలీసులకు పంపించారు. వారు పోలీసు బృందాన్ని ఆ ప్రాంతానికి పంపించి, ఇద్దరినీ అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తీసుకొచ్చారు. వీరిని బుధవారం మధ్యాహ్నానికి విమానంలో విజయవాడకు తీసుకురానున్నారు. 
 
కాగా, తన కుమార్తె ఆచూకీ లభించిన తర్వాత తేజస్విని తల్లి శివకుమారి విజయవాడ పోలీసు కార్యాలయంలో సీపీ రామకృష్ణను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్.. పవన్ కల్యాణ్ ఫోనులో మాట్లాడారు. కేసు ఛేదించిన తీరును వివరించారు. 'కిడ్నాప్ చేశారా?' అని సీపీని పవన్ ప్రశ్నించగా.. కాదని, వారు ఇక్కడికి వచ్చాక మరిన్ని వివరాలు రాబడతామన్నారు. యువతిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు కృషి చేసినందుకు సీపీ రామకృష్ణను పవన్ అభినందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

గోల్డ్ స్మగ్లింగ్ కేసు : కన్నడ నటి రన్యారావుకు జైలు

NATSలో శంబాల టీజర్ కు స్పందన, చివరి దశలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు

వినూత్నమైన కాన్సెప్ట్ తో బకాసుర రెస్టారెంట్‌ : దర్శకుడు ఎస్‌జే శివ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments