Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాకినాడ గెలుపు చాలా ఆనందాన్ని ఇచ్చింది : మంత్రులతో చంద్రబాబు

కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయబావుటా ఎగురవేయడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం జరిగిన ఓట్ల లెక్కింపులో టీడీపీ సంపూర్ణ మెజార్టీని సాధి

Webdunia
శుక్రవారం, 1 సెప్టెంబరు 2017 (11:41 IST)
కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయబావుటా ఎగురవేయడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం జరిగిన ఓట్ల లెక్కింపులో టీడీపీ సంపూర్ణ మెజార్టీని సాధించి మున్సిపాలిటీని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. 
 
చాలా సంవత్సరాల తర్వాత తిరిగి కాకినాడను కైవసం చేసుకోవడంపై చంద్రబాబు తన ఆనందాన్ని వ్యక్తంచేశారు. కొద్దిసేపటి క్రితం ఫలితాలను మంత్రులతో కలసి సమీక్షించిన ఆయన, గెలుపునకు కృషి చేసిన వారిని అభినందించారు. ఈ ఫలితం తనకు సంతృప్తినిచ్చిందని, ఇదే స్ఫూర్తితో మరింత అభివృద్ధి చేద్దామని అన్నారు. 
 
మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి, కళా వెంకట్రావులతో సమావేశమైన చంద్రబాబు, అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారని వ్యాఖ్యానించారు. కాగా, ఇప్పటివరకూ విడుదలైన కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ 30, బీజేపీ 3, వైకాపా 9, ఇతరులు 3 స్థానాలను (గెలుపు ప్లస్ ఆధిక్యం) దక్కించుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

Prabhas: నిర్మాత వదిలేసినా, ఇండస్ట్రీ వద్దన్నా మారుతీ తో ప్రభాస్ రాజాసాబ్ ఎందుకు చేశాడు

Rashmika: మా కెమిస్ట్రీ చూశాక మరిన్ని అవకాశాలు వస్తాయి : రష్మిక మందన్నా

Ye Maaya Chesave: ఏ మాయ చేసావే రీ-రిలీజ్: ప్రమోషన్ కోసం చైతూ- సమంత కలిసి కనిపిస్తారా?

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments