Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లికి ఉరేసింది.. ఆపై ఉరేసుకుంది.. అమ్మ కోసం పెళ్లి కూడా చేసుకోకుండా..?

సెల్వి
బుధవారం, 30 అక్టోబరు 2024 (19:19 IST)
కాకినాడ జిల్లాలో తల్లికి ఉరేసి.. ఆపై కుమార్తె కూడా ఉరేసుకున్న ఘటన స్థానికంగా సంచలనం రేపింది. కాకినాడ వ‌న్‌టౌన్ సీఐ నాగ‌దుర్గారావు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం… బీఆర్ అంబేద్క‌ర్ కోన‌సీమ జిల్లా పి.గ‌న్న‌వ‌రం మండ‌లం వై.కొత్త‌ప‌ల్లికి చెందిన ఆకాశం స‌ర‌స్వ‌తి (60), ఆమె కుమార్తె స్వాతి (28) ప‌న్నెండేళ్లుగా కాకినాడ పెంకెవారి వీధిలోని ఓ భ‌వ‌నం మొద‌టి అంత‌స్తులో అద్దెకు ఉంటున్నారు. స‌రస్వ‌తి భ‌ర్త న‌ర్సింహారావు ప‌ద‌హారేళ్ల క్రితం అనారోగ్యంతో చ‌నిపోయారు. 
 
భ‌ర్త చ‌నిపోవ‌డంతో స‌ర‌స్వ‌తి త‌న పిల్ల‌ల‌ను తీసుకొని జీవ‌నోపాధి కోసం కాకినాడ‌కు వ‌చ్చేశారు. పెద్ద కుమార్తె బుజ్జికి వివాహం కాగా విశాఖ‌ప‌ట్నంలో ఉంటున్నారు. 
 
చిన్న కుమార్తె స్వాతి ఇంట్లోనే టైల‌రింగ్ చేస్తుండేది. సరస్వ‌తి కొన్నాళ్లుగా అనారోగ్యం, మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. దాంతో స్వాతి ఆందోళ‌న‌కు గుర‌య్యారు. దీంతో లాభం లేదనుకున్న స్వాతి తల్లికి ఉరేసి.. ఆపై తాను కూడా ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. 
 
త‌ల్లి కోసం పెళ్లి కూడా చేసుకోకుండా ఉండి పోయిన కుమార్తె ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డంపై అంద‌రూ షాకవుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments