Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసెంబ్లీని అనంతపురంలో పెట్టాలి : వైకాపా ఎమ్మెల్యే

Webdunia
ఆదివారం, 29 డిశెంబరు 2019 (15:32 IST)
ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల కాన్సెప్టుకు జైకొట్టిన వైకాపాకు చెందిన కదిరి ఎమ్మెల్యే పీవీ సిద్ధారెడ్డి.. మరో కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. అనంతపురంలో అసెంబ్లీని ఏర్పాటు చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఒక్క అమరావతిని లక్ష కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసే బదులు, మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేయవచ్చన్నారు. ఇక్కడ అసెంబ్లీని పెట్టి, శీతాకాల సమావేశాలు నిర్వహిస్తే బాగుంటుందని సిద్ధారెడ్డి అభిప్రాయపడ్డారు. వివిధ శాఖల అధిపతుల కార్యాలయాలను కూడా జిల్లాల స్థాయిలో ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. 
 
మరోవైపు, రాజధాని మార్పు అంశంపై మంత్రి మోపిదేవి వెంకటరమణ స్పందించారు. అమరావతిలో 4,500 ఎకరాల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించారు. రాజధాని మార్పుపై హైపవర్ కమిటీ నివేదికదే తుది నిర్ణయం అన్నారు. గత పొరపాట్లు పునరావృతంకాకుండా నిర్ణయాలుంటాయని చెప్పారు.
 
గత ప్రభుత్వ హయాంలో అమరావతి పేరిట జరిగిన అక్రమాలు బటయకు వస్తాయని మంత్రి మోపిదేవి చెప్పారు. ఇక్కడకు రావాల్సిన పెట్టుబడులు తెలంగాణకు వెళ్లాయన్నది అవాస్తవమని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనేక సంస్థలు ముందుకొస్తున్నాయని మంత్రి మోపిదేవి చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments