Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యక్తిని చంపి.. తలను ముక్కలు చేసి.. టిఫిన్ బాక్సులో పెట్టి...

Webdunia
బుధవారం, 24 జూన్ 2020 (15:54 IST)
రాయలసీమ జిల్లాల్లో ఒకటైన కడపలో దారుణం జరిగింది. జిల్లాలోని యర్రగుంట్లలో ఐసీఎల్ రిటైర్డ్ ఉద్యోగి వెంకట రమణయ్య దారుణ హత్యకు గురయ్యారు. ఈయనను హత్య చేసి, తలను శరీరం నుంచి వేరు చేసి, దాన్ని కూడా ముక్కలు చేసి టిఫిన్ బాక్సులో పెట్టి లోయలో పడేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, యర్రగుంట్లలో ఐసీఎల్ రిటైర్డ్‌ ఉద్యోగి వెంకట రమణయ్య తలను గువ్వల చెరువు ఘాట్ వద్ద ఓ టిఫిన్ బాక్సులో పోలీసులు గుర్తించారు. 
 
ఆ తలను ముక్కలు చేసి టిఫిన్ బాక్సులో పెట్టి ముసలయ్య లోయలో పడేసినట్లు తేల్చారు. అనంతరం ఆయన ఇంట్లో వెంకట రమణయ్య మొండాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు. 
 
ప్రాథమిక విచారణలో భాగంగా, మునిసిపల్ మాజీ ఛైర్మన్ ముసలయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది. పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments