Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకరి ప్రాణాలు తీసిన 'అరవింద సమేత'... మరో ఇద్దరికి గాయాలు

Webdunia
బుధవారం, 17 అక్టోబరు 2018 (16:19 IST)
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "అరవింద సమేత వీరరాఘవ". ఈ చిత్రం రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలో తమ భాషను, జీవితాల్ని కించపరిచారని జలం శ్రీను, సీమ కృష్ణానాయక్, రవికుమార్, రాజశేఖర్ రెడ్డిలు హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి ఆరోపించారు.
 
ఆ తర్వాత వీరు ఓ ఛానల్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొని సొంతూరుకు వెళ్లిపోయారు. బుధవారం మరో ఛానల్‌లో జరగనున్న చర్చా కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. ఇందుకోసం మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు బయలుదేరారు. కానీ మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా, ముగ్గురు తీవ్రంగాగాయపడ్డారు. 
 
'వారి ప్రయాణం తుంగభద్రానదిని దాటి కొంత దూరం సాగింది. హఠాత్తుగా హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరి వాహనం నుజ్జునుజ్జయింది. జలం శ్రీను అక్కడిక్కడే తుదిశ్వాస విడిచారు. ఆయన బహుజన ఉద్యమంతోపాటు సీమ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నారు. మిగిలినవారు తీవ్రంగా గాయపడ్డారు' అని వారు స్నేహితులు ఫేస్‌బుక్‌లో వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments