Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కూతురు ఫోన్ నంబరు అపరిచితుడికిస్తావా? మహిళ గొంతు కోసిన వ్యక్తి...

Webdunia
బుధవారం, 15 మే 2019 (17:09 IST)
తన కుమార్తెను ఓ పోకిరి వేధించడానికి కారణమైన ఓ మహిళను ఓ వ్యక్తి గొంతు కోశాడు. పట్టపగలు, అందరు చూస్తుండగా నడి రోడ్డుపై గొంతుకోశాడు. ఈ దారుణం కడప జిల్లా బద్వేలులో కలకలం రేపింది. 
 
బుధవారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సిద్ధవటం రోడ్డులోని నూర్‌ బాషాకాలనీలో టైలర్‌గా రాయపాటి బాషా అనే వ్యక్తి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు ఇద్దరు కుమార్తెలు. ఇద్దరు కుమారులు. చిన్న కుమార్తె భర్త బెంగళూరులో పని చేస్తుండటంతో ఆమె మాత్రం తండ్రివద్దే నివశిస్తోంది. 
 
ఈ క్రమంలో ఆమెకు ఓ ఫోన్ నంబర్ నుంచి తరచూ రాంగ్ కాల్స్ వస్తుండటం, వేధిస్తుండటంతో బాషా మరో నంబర్ నుంచి అదే ఫోన్‌కు కాల్ చేసి నిలదీశాడు. తనకు అదే కాలనీలో ఉండే వెంకట సుబ్బారెడ్డి భార్య సుబ్బలక్ష్మమ్మ ఫోన్ నంబర్ ఇచ్చిందని చెప్పడంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. 
 
తన కుమార్తె ఫోన్ నంబర్‌ను అపరిచితుడికి ఎందుకు ఇచ్చావంటూ ఆమెతో పలుమార్లు గొడవకు దిగాడు. అయినా ఆ అపరిచితుడు మాత్రం ఫోన్ చేస్తూ టార్చర్ పెట్టసాగాడు. దీంతో పాల కోసం బయటకు వచ్చిన సుబ్బలక్ష్మమ్మపై బాషా కత్తితో దాడి చేసి గొంతు కోశాడు. 
 
ఈ ఘటనలో ఆమెకు తీవ్రగాయాలు కాగా, స్థానికులు ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి భర్త ఇచ్చిన  ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి బాషాను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments