Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇది రాజకీయ విమర్శలు చేసే సమయం కాదు : కేఏ పాల్ (Video)

ఠాగూర్
బుధవారం, 4 సెప్టెంబరు 2024 (10:49 IST)
విజయవాడ నగరాన్ని బుడమేరు వరద నీరు ముంచెత్తిందని, అనేక ప్రాంతాలు ఇప్పటికీ జలదిగ్బంధంలో చిక్కుకుని ఉన్నాయని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వరద బాధితులకు అండగా నిలబడి, సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. పైగా, ఇది రాజకీయాలు చేసే సమయం కాదని ఆయన వ్యాఖ్యానించారు. 
 
వరద నీరు ముంచెత్తిన విజయవాడ అజిత్ సింగ్ నగర్‌లో ఆయన పర్యటించి, అనేక మంది వరద బాధితులకు వివిధ రకాల సహాయాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బుడమేరును ఆక్రమించిన రాజకీయ నేతలు, బడా నేతలు భారీ భవంతులను నిర్మించడం వల్లే ఈ విపత్కర పరిస్థితులకు ప్రధాన కారణమన్నారు. అందువల్ల బుడమేరు ఆక్రమణలను తక్షణం తొలగిస్తేనే భవిష్యత్‌లో విజయవాడ నగరానికి జలగండం ఉండదన్నారు. 
 
ఇపుడు సంభవించిన వరదల కారణంగా మునిగిపోయిన కాలనీలకు చెందిన ప్రజలను ఆదుకోవాలని ఆయన కోరారు. ఇందుకోసం తన వంతు సాయం చేస్తానని తెలిపారు. పైగా, విజయ్ మాల్యా వంటి కోటీశ్వరులకు లక్ష కోట్ల రూపాయలు మాఫీ చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇపుడు ఈ వరద బాధితులను ఆదుకునేందుకు కేవలం పది వేల కోట్ల రూపాయల నిధులను ఇవ్వాలని ఆయన కోరారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments