తెలంగాణ రాష్ట్ర సమితిపై ప్రజలకు ఇంకా అనేక భ్రమలు ఉన్నాయనీ, అందువల్లే వారికి ప్రజలు ఓట్లు వేస్తున్నారంటూ తెలంగాణ కాంగ్రెస్ సీఎల్పీ నేత కె.జానారెడ్డి వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ తెరాస సర్కారు ఏదో చేస్తుందని నమ్మి ప్రజలు ఓట్లు వేశారని అన్నారు. ప్రజలు కోరుకుంటున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలుచేయాలని సూచించారు.
ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. పాలేరులో విజయం సాధించిన తుమ్మల నాగేశ్వర్రావుకు ఆయన శుభాకాంక్షలను తెలియజేశారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమన్నారు. ఈ ఓటమితో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నిరాశచెందాల్సిన అవసరం లేదన్నారు. ఓడిపోయినప్పుడు నిరాశ, బాధ సహజమే అయినా కాంగ్రెస్ శ్రేణులు ఈ ఓటమిని సవాలుగా తీసుకుని గెలుపుకోసం కష్టపడాలని పిలుపునిచ్చారు.