మా హీరో గొప్పవాడు.. కాదు మాహీరోనే గొప్పవాడు.. అని ఇద్దరు అభిమానులు ఎవరికి వారు వాదించుకున్నారు. ఆ వాదనకాస్తా చినికిచినికి గాలివానై ఒక హీరో అభిమాని మరో హీరో అభిమానిని కత్తితో పొడవడంతో అతడు మరణించాడు.
మా హీరో గొప్పవాడు.. కాదు మాహీరోనే గొప్పవాడు.. అని ఇద్దరు అభిమానులు ఎవరికి వారు వాదించుకున్నారు. ఆ వాదనకాస్తా చినికిచినికి గాలివానై ఒక హీరో అభిమాని మరో హీరో అభిమానిని కత్తితో పొడవడంతో అతడు మరణించాడు. చనిపోయిన అభిమాని పవన్ కళ్యాణ్ అభిమాని కాగా, చంపింది జూనియర్ ఎన్టీఆర్ అభిమాని. ఈ వివరాలను పరిశీలిస్తే...
తిరుపతి పట్టణానికి చెందిన వినోద్ రాయల్ జనసేన పార్టీ అధినేత పవన కల్యాణ్కు వీరాభిమాని. పార్టీ తరపున తరచూ నగరంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు. ఈ క్రమంలో ఆదివారం కర్ణాటకలోని కోలార్లో పవన్కల్యాణ్ అభిమానుల ఆధ్వర్యంలో జరిగిన అవయవదాన కార్యక్రమానికి వినోద్ రాయల్ హాజరయ్యాడు.
ఈ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా కొంతమంది హాజరయ్యారు. కార్యక్రమం జరుగుతుండగా, వినోద్ రాయల్.. జై పవన్ అంటూ నినాదాలు చేయడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అడ్డుచెప్పాడు. దీంతో ఇరువురి మధ్య తీవ్రస్థాయిలో వాదనలు జరిగాయి. దీంతో తమ హీరో గొప్ప అంటూ ఎవరికి వారు వాగ్వాదానికి దిగారు.
ఈ నేపథ్యంలో అసహనానికి గురైన జూనియర్ ఎన్టీఆర్ అభిమాని వినోద్ను కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్నేహితులు చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు చెప్పారు. సోమవారం నగరంలోని వినోద్ స్వగృహానికి మృతదేహాన్ని తీసుకువచ్చారు. జనసేన కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చి ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. ఘటనపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్... తిరుపతికి వెళ్లి వినోద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.