Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్‌ను చంపించింది జగనే... పిచ్చోడిలా జగన్ మోహన్ రెడ్డి... జేసీ సంచలన వ్యాఖ్యలు

జేసీ సోదరులు మాట్లాడే మాటలు సంచలనాత్మకంగా వుంటాయన్న సంగతి తెలిసిందే. తాజాగా జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డిని చంపించింది జగన్ మో

Webdunia
శనివారం, 4 మార్చి 2017 (14:15 IST)
జేసీ సోదరులు మాట్లాడే మాటలు సంచలనాత్మకంగా వుంటాయన్న సంగతి తెలిసిందే. తాజాగా జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డిని చంపించింది జగన్ మోహన్ రెడ్డేనంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు జేసీ. ముఖ్యమంత్రి పదవి కోసం జగన్ ఈ దారుణానికి తెగబడ్డారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 
 
కృష్ణా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం వ్యవహారంలో సీఎం చంద్రబాబు తమను కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించడంపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను సీఎం ఎలా కాపాడుతున్నాడో జగన్ మోహన్ రెడ్డి నిరూపించాలంటూ ప్రశ్నాస్త్రం సంధించారు.
 
జగన్ మోహన్ రెడ్డి ఎలాగైనా ముఖ్యమంత్రి కావాలని అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారనీ, కానీ ఆయన జీవితాంతం ఆ పదవిని చేపట్టలేరని జోస్యం చెప్పారు. 2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందనీ, తనే ముఖ్యమంత్రిని అవుతానంటూ జగన్ మోహన్ రెడ్డి రోడ్లపై పిచ్చోడిలా తిరుగుతున్నాడంటూ ఎద్దేవా చేశారు.

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments