Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా వాడు ఢిల్లీకి వెళ్లింది అందుకే.. జగన్‌ ఏమీ తెలియదా? వాడికి అన్నీ తెలుసు: జేసీ

వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ పార్టీ ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు కట్టబెట్టారనే అంశంపై కాదని.. తనపై ఉన్న కేసుల గురించి మాట్లాడుకునేందుకే జగన్ ఢిల్లీకి వెళ్లారని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ ర

Webdunia
శనివారం, 8 ఏప్రియల్ 2017 (17:40 IST)
వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ పార్టీ ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు కట్టబెట్టారనే అంశంపై కాదని.. తనపై ఉన్న కేసుల గురించి మాట్లాడుకునేందుకే జగన్ ఢిల్లీకి వెళ్లారని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విమర్శించారు. మనం గుడికి వెళ్లి దేవుడిని ఆపదల నుంచి గట్టెక్కించమని వేడుకుంటాం.. జగన్‌ కూడా అంతేనని జేసీ ఎద్దేవా చేశారు.

కేసుల నుంచి తప్పించండి మహా ప్రభో అని కోరుకోవడానికే మావాడు ఢిల్లీకి వెళ్లాడని ఎద్దేవా చేశారు. తనపై ఉన్న ఈడీ కేసుల నుంచి విముక్తి పొందడానికే పార్టీ ఫిరాయింపులదారుల అంశాన్ని పేపర్లో రాసుకుని జగన్ ఢిల్లీకి వెళ్లాడని జేసీ అన్నారు. 
 
జగన్‌కు ఏమీ తెలియదనుకుంటే పొరపాటేనని.. వాడికి అన్నీ తెలుసునని జేసీ వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు కట్టబెట్టారంటూ జగన్ ఢిల్లీలో పలువురుని కలుస్తుండటంపై జేసీ ఫైర్ అయ్యారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారంటూ రాష్ట్రపతి వద్దకు వెళ్తే ప్రయోజనం లేదన్నారు. దీనిపై ఇక్కడున్న ముఖ్యమంత్రి వద్దకు కానీ, లేదా ఢిల్లీలో ఉన్న ప్రధానమంత్రి వద్దకు కానీ వెళ్లాలని సూచించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అశ్విన్ పులిహార బాగా కలుపుతాడు - వెండితెర పై క్రికెటర్ కూడా : థమన్

కన్నప్ప కామిక్ బుక్ ఫైనల్ చాప్టర్ కాన్సెప్ట్ వీడియో విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments