Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా వాడు ఢిల్లీకి వెళ్లింది అందుకే.. జగన్‌ ఏమీ తెలియదా? వాడికి అన్నీ తెలుసు: జేసీ

వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ పార్టీ ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు కట్టబెట్టారనే అంశంపై కాదని.. తనపై ఉన్న కేసుల గురించి మాట్లాడుకునేందుకే జగన్ ఢిల్లీకి వెళ్లారని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ ర

Webdunia
శనివారం, 8 ఏప్రియల్ 2017 (17:40 IST)
వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ పార్టీ ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు కట్టబెట్టారనే అంశంపై కాదని.. తనపై ఉన్న కేసుల గురించి మాట్లాడుకునేందుకే జగన్ ఢిల్లీకి వెళ్లారని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విమర్శించారు. మనం గుడికి వెళ్లి దేవుడిని ఆపదల నుంచి గట్టెక్కించమని వేడుకుంటాం.. జగన్‌ కూడా అంతేనని జేసీ ఎద్దేవా చేశారు.

కేసుల నుంచి తప్పించండి మహా ప్రభో అని కోరుకోవడానికే మావాడు ఢిల్లీకి వెళ్లాడని ఎద్దేవా చేశారు. తనపై ఉన్న ఈడీ కేసుల నుంచి విముక్తి పొందడానికే పార్టీ ఫిరాయింపులదారుల అంశాన్ని పేపర్లో రాసుకుని జగన్ ఢిల్లీకి వెళ్లాడని జేసీ అన్నారు. 
 
జగన్‌కు ఏమీ తెలియదనుకుంటే పొరపాటేనని.. వాడికి అన్నీ తెలుసునని జేసీ వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు కట్టబెట్టారంటూ జగన్ ఢిల్లీలో పలువురుని కలుస్తుండటంపై జేసీ ఫైర్ అయ్యారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారంటూ రాష్ట్రపతి వద్దకు వెళ్తే ప్రయోజనం లేదన్నారు. దీనిపై ఇక్కడున్న ముఖ్యమంత్రి వద్దకు కానీ, లేదా ఢిల్లీలో ఉన్న ప్రధానమంత్రి వద్దకు కానీ వెళ్లాలని సూచించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments