Webdunia - Bharat's app for daily news and videos

Install App

యధావిధిగా జన్మభూమి - సర్కార్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకలు...

వరుణ్
మంగళవారం, 25 జూన్ 2024 (08:28 IST)
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ నెల 23వ తేదీ నుంచి ఆగస్టు నుంచి 11 వరకు నిలిపివేసింది. ఇంజనీరింగ్, పట్టాల పటిష్టం, ఇతర మరమ్మతులు కారణంగా ఈ రైళ్ళను రద్దు చేసినట్టు దక్షిణమధ్య రైల్వే వెల్లడించింది. అయితే, ఈ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేయాలనే నిర్ణయంపై దక్షిణ మధ్య రైల్వే వెనక్కు తగ్గింది. జన్మభూమి, సింహాద్రి, రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌లతో పాటు మరి కొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు తొలుత ప్రకటించడంతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. 
 
దీంతో ఈ నెల 23 నుంచి ఆగస్టు 11 వరకు నిలిపివేయాలనుకున్న జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను యధావిధిగా నడపనున్నారు. ఈ నెల 26 నుంచి విశాఖ - లింగంపల్లి(12805), 27 నుంచి లింగంపల్లి - విశాఖ(12806) జన్మభూమి ఎక్స్‌‌ప్రెస్‌ రైళ్లు ప్రయాణించనున్నాయి. ఈ మేరకు వాల్తేరు సీనియర్‌ డీసీఎం కె.సందీప్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. అదేవిధంగా 25వ తేదీ (మంగళవారం) నుంచి చంగల్‌పట్టు - కాకినాడ పోర్టు(17643), 26 నుంచి కాకినాడ పోర్టు - చంగల్‌పట్టు(17644) సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌లు సైతం యధావిధిగా నడవనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments