యధావిధిగా జన్మభూమి - సర్కార్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకలు...

వరుణ్
మంగళవారం, 25 జూన్ 2024 (08:28 IST)
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ నెల 23వ తేదీ నుంచి ఆగస్టు నుంచి 11 వరకు నిలిపివేసింది. ఇంజనీరింగ్, పట్టాల పటిష్టం, ఇతర మరమ్మతులు కారణంగా ఈ రైళ్ళను రద్దు చేసినట్టు దక్షిణమధ్య రైల్వే వెల్లడించింది. అయితే, ఈ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేయాలనే నిర్ణయంపై దక్షిణ మధ్య రైల్వే వెనక్కు తగ్గింది. జన్మభూమి, సింహాద్రి, రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌లతో పాటు మరి కొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు తొలుత ప్రకటించడంతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. 
 
దీంతో ఈ నెల 23 నుంచి ఆగస్టు 11 వరకు నిలిపివేయాలనుకున్న జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను యధావిధిగా నడపనున్నారు. ఈ నెల 26 నుంచి విశాఖ - లింగంపల్లి(12805), 27 నుంచి లింగంపల్లి - విశాఖ(12806) జన్మభూమి ఎక్స్‌‌ప్రెస్‌ రైళ్లు ప్రయాణించనున్నాయి. ఈ మేరకు వాల్తేరు సీనియర్‌ డీసీఎం కె.సందీప్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. అదేవిధంగా 25వ తేదీ (మంగళవారం) నుంచి చంగల్‌పట్టు - కాకినాడ పోర్టు(17643), 26 నుంచి కాకినాడ పోర్టు - చంగల్‌పట్టు(17644) సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌లు సైతం యధావిధిగా నడవనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments