Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొండగట్టుకు బయలుదేరిన పవన్ కళ్యాణ్ ప్రచార రథం "వారాహి"

Webdunia
మంగళవారం, 24 జనవరి 2023 (10:44 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలోని కొండగట్టుకు బయలుదేరారు. తాను ఎన్నికల ప్రచారం కోసం సిద్ధం చేసుకున్న వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు చేయించేందుకు ఆయన బయలుదేరారు. హైదరాబాద్ నగరంలోని తన నివాసం నుంచి మంగళవారం ఉదయం 11 గంటలకు కొండగట్టుకునే పవన్ కళ్యాణ్.. అక్కడ తన ఎన్నికల ప్రచార రథం వారాహికి అంజన్న సన్నిధిలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తారు. ఈ వాహనానికి వేద పండితులు ప్రత్యేక పూజలు చేసి, ఆ తర్వాత ప్రచార రథాన్ని ప్రారంభిస్తారు. 
 
ఆ తర్వాత కొడిమ్యాల మండలం నాచుపల్లి సమీపంలోని ఓ రిసార్టులో తెలంగాణ ముఖ్య నేతలతో జనసేనాని ప్రత్యేకంగా సమావేశమవుతారు. అక్కడి నుంచి ఆయన ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి పుణ్యక్షేత్రానికి చేరుకుంటారు. అక్కడ ఆయన ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడ నుంచి అనుష్టుప్ నారసింహ యాత్రకు శ్రీకారం చుడుతారు. 
 
ఇందులోభాగంగా, ఆయన 31 నారసింహా క్షేత్రాలను ఆయన దశలవారీగా సందర్శిస్తారు. ధర్మపురి దర్శనం అనంతరం ఆయన హైదరాబాద్ నగరానికి చేరుకుంటారు. పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో కొండగట్టు, ధర్మపురి ఆలయ పరిసర ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments