Webdunia - Bharat's app for daily news and videos

Install App

గులాం గిరి చేయను... ఆత్మగౌరవం కోసం గొంతు కోసుకునే వ్యక్తిని : పవన్ కళ్యాణ్

Webdunia
బుధవారం, 7 నవంబరు 2018 (09:10 IST)
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును లక్ష్యంగా చేసుకుని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోమారు విమర్శలదాడి చేశారు. అలాగే, వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిని, ప్రధాని నరేంద్ర మోడీపై కూడా విమర్శలు గుప్పించారు. 
 
జనసేన ప్రజాపోరాట యాత్రలో భాగంగా మంగళవారం సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు హెరిటేజ్‌ వ్యాపారం, జగన్‌కు కాంట్రాక్టులు ఆగిపోతాయని తెలంగాణ అంటేనే వారికి భయం పట్టుకుందన్నారు. జగన్‌ను వరంగల్‌లో కొట్టి తరిమేశారన్నారు. 
 
తెలంగాణ ప్రజలు ఇద్దరినీ రానివ్వరన్నారు. కులమతాలు, ప్రాంతాలకు అతీతంగా మాట్లాడతాం కాబట్టే రెండు రాష్ట్రాలకూ జనసైనికులు వెళ్లగలరని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో దశాబ్దాలుగా ఉన్న నాయకులు మిగిలిన పార్టీలవైపు వస్తుంటే.. చంద్రబాబు వారి కాళ్లు పట్టుకుని అటువైపు వెళ్లడం బాధ కలిగించిందన్నారు. 
 
పైగా, ప్రధాని నరేంద్ర మోడీకి తాను దత్తపుత్రుడను కాదంటూ.. లోకేష్‌ కుమారుడు మోడీని తాతా తాతా అంటాడు.. వారికే ఆయనతో బంధుత్వాలు ఉన్నాయి. తనకు మోడీపై ఎటువంటి మోజూ లేదు, భయమూ లేదన్నారు. 'మీలా రెండు చేతులతో గులాం చేసే వాడిని కాదు.. ఆత్మగౌరవం కోసం గొంతు కోసుకునే వ్యక్తిని' అని అంటూ వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments