Webdunia - Bharat's app for daily news and videos

Install App

బద్వేల్ బైపోల్ : పోటీకి జనసేన సిద్ధం

Webdunia
గురువారం, 30 సెప్టెంబరు 2021 (16:15 IST)
కడప జిల్లాలోని బద్వేల్ అసెంబ్లీ స్థానానికి అక్టోబరు 30వ తేదీన ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీచేసింది. తెలంగాణాలో హుజురాబాద్‌ నియోజకవర్గ ఉప ఎన్నికతో పాటు బద్వేలు ఉప ఎన్నిక నిర్వహించనున్నట్టు ప్రకటించింది. అక్టోబరు 30వ తేదీన ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుండగా అక్టోబరు ఒకటో తేదీన నోటిఫికేషన్ విడుదలకానుంది. నవంబర్ 2వ తేదీ ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన కూడా చేయనున్నారు. 
 
అయితే ఈ ఉప ఎన్నికల్లో వెంకట సుబ్బయ్య సతీమణి డాక్టర్ సుధకు సీఎం జగన్ టికెట్ ఖరారు చేయగా… టీడీపీ అభ్యర్థిగా డా. ఓబుళాపురం రాజశేఖర్‌‌ను ఇప్పటికే ప్రకటించారు చంద్రబాబు. అటు బీజేపీ, జనసేన, కాంగ్రెస్‌ పార్టీలు ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించలేదు.
 
ఈ నేపథ్యంలోనే బద్వేలు ఉప ఎన్నికల్లో పోటీపై బీజేపీ-జనసేన మధ్య సంప్రదింపులు కొనసాగుతోంది. ఏ పార్టీ పోటీ చేయాలనే అంశంపై తర్జన భర్జన అవుతున్నాయి. జనసేన నుంచి అభ్యర్థిని పెట్టాలని బీజేపీ సూచించినట్లు సమాచారం అందుతోంది. తిరుపతిలో బీజేపీ పోటీ చేసిన కారణంగా బద్వేల్లో జనసేనకు అవకాశం ఇవ్వాలన్న యోచనలో బీజేపీ పార్టీ ఉన్నట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

పట్టణంలో కొత్త రాబిన్‌హుడ్ వచ్చింది ఓటీటీలోకి హరి హర వీర మల్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments