Webdunia - Bharat's app for daily news and videos

Install App

రుషికొండకు బోడిగుండు కొట్టేశారు.. 21 ఎకరాల్లో తవ్వకాలు : జనసేన కార్పొరేటర్ మూర్తి

Webdunia
గురువారం, 17 ఆగస్టు 2023 (08:37 IST)
విశాఖపట్ణంలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ఉన్న రిషికొండకు వైకాపా నేతలు బోడిగుండు కొట్టేశారని జనసేన ఆరోపించింది. ఇదే అంశంపై ఆ పార్టీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మాట్లాడుతూ, జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎస్జీటీ) నిబంధనలకు విరుద్ధంగా రుషికొండపై రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టిందని ఆరోపించారు. 
 
వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి హయాంలో రుషికొండ వద్ద భూములను ఒక వర్గానికి కేటాయించగా, వైకాపా హయాంలో వాటి వినియోగాన్ని మార్చేశారని ఆరోపించారు. రుషికొండపై 9.88 ఎకరాల్లో నిర్మాణాలు చేపట్టడానికి వైకాపా ప్రభుత్వం అనుమతులు తీసుకుని 21 ఎకరాల మేర కొండను తవ్వేసి నిర్మాణాలు చేపట్టిందని ఛాయాచిత్రాలతో హైకోర్టుకు నివేదించామన్నారు. 
 
తీర ప్రాంతానికి 200 మీటర్ల తర్వాతే నిర్మాణాలు ఉండాలని, తీర ప్రాంత నియంత్రణ పరిధి నిబంధనల మేరకు 9 మీటర్ల ఎత్తు వరకే కట్టడాలు ఉండాలని పేర్కొన్నారు. అలాగే ఎలాంటి యంత్రాలు వినియోగించకూడదన్నారు. రుషికొండలో ఆయా నిబంధనలన్నింటినీ ఉల్లంఘించారని ఆరోపించారు. అందుకే ప్రభుత్వం రుషికొండ నిర్మాణాలపై రోజుకో ప్రకటన చేస్తోందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంధ్రప్రదేశ్లో తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి నూతన విధానం

Gowtam: మహేష్ బాబు కుమారుడు గౌతమ్ నటుడిగా కసరత్తు చేస్తున్నాడు (video)

Sapthagiri: హీరో సప్తగిరి నటించిన పెళ్లి కాని ప్రసాద్ రివ్యూ

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

తర్వాతి కథనం
Show comments