వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్ కోసమే పొత్తులు : నాదెండ్ల మనోహర్

Webdunia
సోమవారం, 15 మే 2023 (11:48 IST)
వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్ కోసమే పొత్తులకు ఆసక్తి చూపుతున్నట్టు జనసేన పార్టీ అధినేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వ అరాచకత్వం నుంచి ఏపీని విముక్తి చేయడమే జనసేన అధినేత పవన్ కల్యాణ్ లక్ష్యమని, అందుకోసం ఏడాదిగా పొత్తుల కోసం ఆయన కృషి చేస్తున్నారని తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, రాష్ట్రానికి మేలు జరిగేలా పొత్తులు ఉంటాయని తెలిపారు.

బీజేపీ, టీడీపీతో పొత్తులపై పవన్ చర్చలు జరిపారు. ఈ చర్చలు సీట్లపై కాదు. కేవలం రాష్ట్రంలో జరుగుతున్న వైసీపీ ఆరాచక, అవినీతి పాలనపైనే. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా జనసేనాని చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర హితం కోసం పవన్ తీసుకునే నిర్ణయానికి పార్టీ శ్రేణులు సహకారం అందించాల్సిన అవసరం ఉందన్నారు.

జనసేన పార్టీ అవకాశవాద, స్వార్థ రాజకీయాలకు దూరంగా ఉంటుందన్నారు. మండల, పట్టణ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టారని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా జనసేన సిద్ధంగా ఉందన్నారు. పవన్ రైతుల సంక్షేమం కోసం స్వంత నిధులు ఖర్చు చేస్తున్నారు. వ్యవసాయ మంత్రి తన జేబులో నుంచి రైతుల కోసం ఒక్క రూపాయి ఖర్చుచేశారా? అని నిలదీశారు.

సీఎం జగన్ హెలికాఫ్టరులో తిరగడం తప్ప చేసిందేముంది? రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షానికి 1.50 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. సీఎం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. వైసీపీ బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు పవన్ చేస్తున్న కృషిని అభినందించాల్సింది పోయి కొంతమంది చేత దుష్ప్రచారం చేయించడం హాస్యాస్పదంగా ఉంది. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.1,000 కోట్లు ఉంటే కేవలం రూ. వంద కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

IMAXలో స్టార్ట్ అవతార్ హంగామా - భారీగా అడ్వాన్స్ బుకింగ్స్

భూత శుద్ధి వివాహ బంధంతో ఒక్కటైన సమంత - రాజ్ నిడిమోరు

Kandula Durgesh: ఏపీలో కొత్త ఫిల్మ్ టూరిజం పాలసీ, త్వరలో నంది అవార్లులు : కందుల దుర్గేష్

Ram Achanta : అఖండ 2 నిర్మించడానికి గట్టి పోటీనే ఎదుర్కొన్నాం : రామ్, గోపీచంద్ ఆచంట

Bhumika Chawla: యూత్ డ్రగ్స్ మహమ్మారి బ్యాక్ డ్రాప్ తో యుఫోరియా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

తర్వాతి కథనం
Show comments