జనసేన సంస్థాగత బలోపేతం కోసం త్రిశూల్ వ్యూహం : పవన్ కళ్యాణ్

ఠాగూర్
ఆదివారం, 31 ఆగస్టు 2025 (16:22 IST)
జనసేన పార్టీ సంస్థాగత బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టించారు. ఇందుకోసం ఆయన త్రిశూల్ వ్యూహాన్ని అమలు చేయనున్నట్టు తెలిపారు. వైజాగ్ వేదికగా శనివారం జరిగిన సేనతో సేనాని అనే కార్యక్రమంలో ఆయన కీలక ప్రసంగం చేశారు. 
 
పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, రాబోయే దశాబ్దకాలానికి యువ నాయకత్వాన్ని సిద్ధం చేయడమే లక్ష్యంగా కీలక కార్యాచరణను ప్రకటించారు. రాష్ట్రానికి సుస్థిర పాలన అందించేందుకు ప్రస్తుత ఎన్డీయే కూటమి కనీసం 15 ఏళ్ల పాటు కొనసాగాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
 
పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు పవన్ కల్యాణ్ ఒక స్పష్టమైన ప్రణాళికను ఆవిష్కరించారు. దసరా పండుగ తర్వాత 'త్రిశూల్' అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమం ద్వారా పార్టీలోని ప్రతి క్రియాశీల సభ్యుడిని నేరుగా పార్టీ సెంట్రల్ కమిటీ నేతలతో అనుసంధానం చేస్తామని వివరించారు. దీని కోసం ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 
 
రాబోయే పదేళ్లలో యువతను బలమైన నాయకులుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, 2030 నాటికి అనేకమంది శక్తివంతమైన నాయకులను రాష్ట్రానికి అందిస్తానని హామీ ఇచ్చారు. పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న వీరమహిళలకు సముచిత స్థానం కల్పిస్తామని, పార్టీ పదవుల్లో వారికి 33 శాతం కేటాయిస్తామని ప్రకటించారు. క్రమశిక్షణ, అంకితభావం, స్థిరత్వం ఉంటే ఎవరైనా ఉన్నత స్థాయికి ఎదగవచ్చని యువతకు పిలుపునిచ్చారు.
 
"మనం బలహీనపడితే రాష్ట్రంలో మళ్లీ అరాచక పాలన వస్తుంది. కాబట్టి ఈ కూటమి చాలా కాలం కొనసాగాలి. రాష్ట్రానికి వచ్చే 15 ఏళ్ల పాటు రాజకీయ స్థిరత్వం చాలా అవసరం" అని ఆయన అభిప్రాయపడ్డారు. భాగస్వామ్య పక్షాల మధ్య చిన్న చిన్న సమస్యలు తలెత్తితే వాటిని సామరస్యంగా చర్చించుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. 2019-24 మధ్య కాలంలో తమ పార్టీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా, ఎన్నడూ ప్రధాని లేదా హోంమంత్రి సహాయం కోరలేదని, ఆత్మగౌరవంతోనే నిలబడ్డామని గుర్తుచేశారు. 
 
ప్రజాస్వామ్య వ్యవస్థలో హింసకు తావులేదని, తాను విప్లవ మార్గాన్ని ఎంచుకోలేదని పవన్ పేర్కొన్నారు. రాజకీయాలంటే వ్యాపారం కాదని, ప్రజాసేవ అని నమ్మి నిస్వార్థంగా పనిచేస్తున్నందునే మంచి ఫలితాలు వస్తున్నాయని ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సభ జనసేన శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపడంతో పాటు, పార్టీ భవిష్యత్ ప్రయాణంపై ఒక స్పష్టమైన మార్గదర్శినిగా నిలిచింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్.. దివ్వెల మాధురి ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ భారీగా తీసుకుందా?

Ashika Ranganath :స్పెషల్ సెట్ లో రవితేజ, ఆషికా రంగనాథ్ పై సాంగ్ షూటింగ్

SSMB29: రాజమౌళి, మహేష్ బాబు సినిమా అప్ డేట్ రాబోతుందా?

Shyamala Devi : గుమ్మడి నర్సయ్య దర్శకుడిని ప్రశంసించిన శ్యామలా దేవీ

NBK 111: బాలక్రిష్ణ నటిస్తున్న ఎన్.బి.కె. 111 చిత్రం నవంబర్ 7న ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments