Webdunia - Bharat's app for daily news and videos

Install App

వినాయక చవితికి కొత్త నినాదం.. స్వదేశీ ఉత్పత్తులే వాడాలి.. జనసేనాని

Webdunia
శుక్రవారం, 21 ఆగస్టు 2020 (12:14 IST)
జనసేన కొత్త నినాదానికి శ్రీకారం చుట్టింది. ప్రజలంతా స్వదేశీ ఉత్పత్తులే వాడాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. ఈ వినాయక చవితి నుంచే దీన్ని ప్రారంభించాలని పిలుపునిచ్చారు. వినాయక చవితి నుంచి ఈ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లనున్నట్లుగా ప్రకటించారు. 
 
పండుగ కోసం ఏ వస్తువు కొన్నా.. అది ఎక్కడ తయారైందో చూడాలని పవన్ పిలుపు నిచ్చారు. మన ఉత్పత్తుల గిరాకీ కోసమే స్వదేశీ నినాదమని పవన్‌ స్పష్టం చేశారు. 'ఆత్మ నిర్భర్‌ భారత్‌' నినాదం ఏ ఒక్క వర్గానికో కాదని.. దేశ ప్రజలందరి అభివృద్ధికి సంబంధించిందని చెప్పుకొచ్చారు. 'మన ఉత్పత్తి, మన ఉపాధి, మన అభివృద్ధి..' ఇదే 'ఆత్మనిర్భర భారత్‌' అని పవన్‌ అభివర్ణించారు. 
 
అందుకే ఈ వినాయక చవితి నుంచే ఆ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలని జనసేన- భారతీయ జనతా పార్టీ సంయుక్తంగా నిర్ణయించాయని ఆయన వెల్లడించారు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని ఆయన పార్టీ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

సుధీర్ బాబు హీరోగా జీ స్టూడియోస్ సమర్పణలో జటాధర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments