Webdunia - Bharat's app for daily news and videos

Install App

వినాయక చవితికి కొత్త నినాదం.. స్వదేశీ ఉత్పత్తులే వాడాలి.. జనసేనాని

Webdunia
శుక్రవారం, 21 ఆగస్టు 2020 (12:14 IST)
జనసేన కొత్త నినాదానికి శ్రీకారం చుట్టింది. ప్రజలంతా స్వదేశీ ఉత్పత్తులే వాడాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. ఈ వినాయక చవితి నుంచే దీన్ని ప్రారంభించాలని పిలుపునిచ్చారు. వినాయక చవితి నుంచి ఈ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లనున్నట్లుగా ప్రకటించారు. 
 
పండుగ కోసం ఏ వస్తువు కొన్నా.. అది ఎక్కడ తయారైందో చూడాలని పవన్ పిలుపు నిచ్చారు. మన ఉత్పత్తుల గిరాకీ కోసమే స్వదేశీ నినాదమని పవన్‌ స్పష్టం చేశారు. 'ఆత్మ నిర్భర్‌ భారత్‌' నినాదం ఏ ఒక్క వర్గానికో కాదని.. దేశ ప్రజలందరి అభివృద్ధికి సంబంధించిందని చెప్పుకొచ్చారు. 'మన ఉత్పత్తి, మన ఉపాధి, మన అభివృద్ధి..' ఇదే 'ఆత్మనిర్భర భారత్‌' అని పవన్‌ అభివర్ణించారు. 
 
అందుకే ఈ వినాయక చవితి నుంచే ఆ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలని జనసేన- భారతీయ జనతా పార్టీ సంయుక్తంగా నిర్ణయించాయని ఆయన వెల్లడించారు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని ఆయన పార్టీ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments