Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిరోముండనం కేసులో వైకాపా ఎమ్మెల్యే తోట త్రిమూర్తులకు జైలుశిక్ష!!

వరుణ్
మంగళవారం, 16 ఏప్రియల్ 2024 (15:10 IST)
వైకాపా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు విశాఖపట్టణంలోని ఎస్సీఎస్టీ కోర్టు తేరుకోలేని షాకిచ్చింది. శిరోముండనం కేసులో ఆయనకు 18 నెలల పాటు జైలుశిక్ష విధిస్తూ సంచలన తీర్పును వెలువరించింది. దీంతో పాటు రూ.2.50 లక్షల అపరాధం కూడా విధిస్తూ ఆదేశాలు జారీచేసింది. ఈ కేసులో త్రిమూర్తులతో పాటు ఆరుగురు నిందితులను దోషులుగా నిర్ధారించింది. 
 
గత 28 యేళ్ళ క్రితం జరిగిన కేసులో కోర్టు ఈ సంచలన తీర్పును వెలువరించడం గమనార్హం. 1996 డిసెంబరు 29వ తేదీన దళితులను హింసించి, వారిలో ఇద్దరికి శిరోముండనం చేశారు. గుండు కొట్టించడంతో పాటు కనుబొమ్మలను కూడా తీసేశారు. ప్రస్తుతం కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాళెంలో ఈ ఘటన జరిగింది. అప్పట్లో ఈ ఘటన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. కాగా, కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై దోషులు హైకోర్టులో అప్పీల్ చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments