Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరసాపురం పార్లమెంట్ టికెట్ రేసులో ప్రభాస్ పెద్దమ్మ?

సెల్వి
గురువారం, 11 జనవరి 2024 (19:37 IST)
ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. నరసాపురం పార్లమెంట్ టికెట్ కోసం ఆసక్తికర వార్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రఘురామ కృష్ణంరాజు గెలుపొందారు. అయితే.. విజయం సాధించిన కొన్ని రోజులకే ఆయన ఆ పార్టీని విభేదించారు. 
 
సీఎం జగన్‌ను టార్గెట్ చేశారు. ఈ క్రమంలో ఆయన టీడీపీకి దగ్గరయ్యారు. టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఈ సారి ఆయన బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈసారి వైసీపీ టికెట్ ఎవరికి దక్కుతుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
 
ప్రముఖ యువహీరో ప్రభాస్ పెద్దమ్మ శ్యామలదేవి వైసీపీ టికెట్ రేసులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే స్థానం నుంచి శ్యామలాదేవి భర్త కృష్ణం రాజు 1999లో ఎంపీగా గెలుపొందారు. 
 
వీరితో పాటు వైసీపీ టికెట్ రేసులో గోకరాజు గంగరాజు కుమారుడు గోకరాజు వెంకట కనక రంగరాజు కూడా టికెట్ రేసులో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో ఈ సీటు జగన్ ఎవరికిస్తారనే దానిపై ప్రస్తుతం చర్చ సాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments