Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుమ్ముగూడెం - నాగార్జునసాగర్‌ ప్రాజెక్టును నేషనల్ ప్రాజెక్టుగా..

Webdunia
శుక్రవారం, 22 ఆగస్టు 2014 (12:52 IST)
దుమ్ముగూడెం - నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్ట్‌ను జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి జగన్ ఓ లేఖ రాశారు.
 
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని రైతుల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్ట్‌ను జాతీయ ప్రాజెక్ట్‌గా గుర్తించాలని జగన్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఖమ్మం, వరంగల్, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలో నాలుగు లక్షల ఎకరాలకు సాగు నీరందుతుందని తెలిపారు. 
 
ప్రాజెక్ట్ నిర్మాణం ద్వారా గోదావరి నదీ జలాలను నాగార్జునసాగర్ వైపునకు లిఫ్ట్ ఇరిగేషన్ పద్ధతిలో మళ్లిస్తే ఇరు రాష్ట్రాల రైతులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని జగన్ లేఖలో పేర్కొన్నారు.
 
రాష్ట్ర విభజన నేపథ్యంలో దుమ్ముగూడెం - నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్ట్ నిర్మాణంపై నీలి నీడలు కమ్ముకున్నాయని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. 

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments