Webdunia - Bharat's app for daily news and videos

Install App

తుగ్లక్ లా జగన్ పాలన...సీపీఐ

Webdunia
గురువారం, 22 ఆగస్టు 2019 (07:47 IST)
తుగ్లక్ పాలనలా జగన్ పాలన వుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ... "రాష్ట్రంలో ఇసుక కొరతతో భవన కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సెప్టెంబర్ 5 నుంచి రాష్ట్రంలో కొత్త ఇసుక పాలసీ వస్తుంది అని మంత్రి చెప్పారు. సీఎం రాష్ట్రంలో లేని సమయంలో మంత్రి రాజధాని పై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు.

ఇసుక ధరలు తగ్గించాలని కోరాము. రాజధాని కోసం రైతులు 33వేల ఎకరాలు ఇచ్చారు. ఇంత ప్రజాధనం వృధా చేయటం కరెక్టు కాదు. ఇక్కడే రాజధాని ఉంటుందని భావిస్తున్నాము. రాజధాని మార్చితే జగన్ తుగ్లక్ పాలన అనిపిస్తుంది. అటువంటి నిర్ణయం సీఎం తీసుకోరు అనుకుంటున్నాము" అని పేర్కొన్నారు. 
 
మరో వైపు విజయవాడ ఎంపీ, టీడీపీ ఎంపీ కేశినేని నాని... జగన్ ను తనదైన శైలిలో ఎద్దేవా చేశారు. తుగ్లక్ లా చరిత్రకు ఎక్కకూడదంటూ ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. "వైఎస్ జగన్ రెడ్డి గారు... చిన్నప్పుడు మొహ్మద్ బీన్ తుగ్లక్ తుగ్లక్ గురించి చరిత్ర పుస్తకాల్లో చదివాము.

1328లో ఢిల్లీ నుండి రాజధానిని మహారాష్ట్ర దౌలతాబాద్ కు,  అక్కడ నుండి తిరిగి ఢిల్లీకి మార్చిన వైనం. మీరు ఆ తుగ్లక్ లాగా చరిత్ర ఎక్కకుడదని భగవంతుడిని కోరుకుంటున్నా" అని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments