Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ హత్యకు మంత్రి దేవినేనే కారణం : వైఎస్ జగన్ ధ్వజం

Webdunia
శనివారం, 23 ఆగస్టు 2014 (09:17 IST)
కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలోని గొట్టిముక్కల గ్రామంలో వైకాపా నేత కృష్ణారావు హత్యకు మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావే ప్రధాన కారకుడని స్థానిక గ్రామస్థులు చెపుతున్నారని అసెంబ్లీలో వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలో శాంతిభద్రతలపై చర్చ సందర్భంగా జగన్ వాడివేడిగా మాట్లాడారు. 
 
మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ప్రోద్బలంతోనే దాడులు, దౌర్జన్యాలు జరిగాయని గొట్టిముక్కల గ్రామ స్థానికులు ఆరోపించారని పేర్కొన్నారు. మొన్నటి వరకు 11 మంది హత్యకు గురయ్యారని, ఈ రెండురోజుల్లో మరో ముగ్గురు హత్యకు గురయ్యారన్నారు. శాంతి భధ్రతలపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరులో మార్పు కోరుకుంటుంటే గతంలోకి వెళ్లి అవాస్తవాలు చెబుతున్నారని, చర్చను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. 
 
ఇదే అంశంపై పలువురు వైకాపా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి వచ్చిన మూడునెలల్లో జరిగిన 14 హత్యలపై చర్చ జరగాలని తాము కోరుతుంటే టీడీపీ సభను తప్పుదారి పట్టిస్తోందని కొడాలి నాని ఆరోపించారు. సభలో టీడీపీ తీరు చూస్తే ఇకపైనా వైసీపీ కార్యకర్తలపై దాడులు కొనసాగిస్తారనే భయం కలుగుతోందన్నారు. దురుద్దేశంతోనే పరిటాల రవి హత్యకేసులో జగన్‌పై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 

డీ-హైడ్రేషన్‌తో ఆస్పత్రిలో చేరిన షారూఖ్ ఖాన్..

Rave Party: నేనో ఆడపిల్లను, బర్త్ డే పార్టీ అంటే వెళ్లా, నాకేం తెలియదు: నటి ఆషీరాయ్

హారర్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ గా అదా శర్మ C.D సెన్సార్ పూర్తి

లవ్ మీ చిత్రం రీష్యూట్ నిజమే - అందుకే శనివారం విడుదల చేస్తున్నాం : ఆశిష్

మంచు లక్ష్మి ఆదిపర్వం పై సెన్సార్ ప్రశంస - ఐదు భాషల్లో విడుదల

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

Show comments