Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పుడు 'చెప్పు' వ్యాఖ్య... ఇప్పుడు బాబుకు 'తోలు మందం' అంటూ జగన్

జగన్ మోహన్ రెడ్డి ఎంతమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మొన్న అనంతపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కడ కనబడితే అక్కడ చెప్పులతో కొట్టాలంటూ వ్యాఖ్యానించిన జగన్ మోహన్ రెడ్డి, తాజాగా మరోసారి చంద్రబాబు నాయుడ

Webdunia
శనివారం, 4 జూన్ 2016 (13:52 IST)
జగన్ మోహన్ రెడ్డి ఎంతమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మొన్న అనంతపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కడ కనబడితే అక్కడ చెప్పులతో కొట్టాలంటూ వ్యాఖ్యానించిన జగన్ మోహన్ రెడ్డి, తాజాగా మరోసారి చంద్రబాబు నాయుడిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గ పరిధిలోని ఎన్‌పీ కుంటలో రైతు భరోసా యాత్రలో ఆయన మాట్లాడారు. 
 
ఈ సందర్భంగా ఆయన... చంద్రబాబుకు తోలు మందం ఎక్కువైందని, అందుకే రైతులను పట్టించుకోవడం లేదంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. నియంత హిట్లర్ మాదిరిగా ప్రవర్తిస్తున్న చంద్రబాబు భూ కుంభకోణాలకు పాల్పడుతున్న వారిని వెనకేసుకొస్తున్నారంటూ విమర్శించారు. ఇదిలావుండగా మొన్న జగన్ మోహన్ రెడ్డి సీఎంను చెప్పులతో కొట్టాలంటూ వ్యాఖ్యలు చేయడంపై తెదేపా శ్రేణులు తీవ్ర నిరశనను తెలియజేస్తున్నాయి. ఐతే జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఎంతమాత్రం వెనక్కి తగ్గడంలేదు. తనదైన పంథాలో వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments