Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపు వాహన మిత్ర నిధుల విడుదల - విశాఖకు వెళ్లనున్న సీఎం జగన్

Webdunia
గురువారం, 14 జులై 2022 (19:35 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి శుక్రవారం విశాఖపట్టణంకు వెళుతున్నారు. వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ఒకటైన వాహన మిత్ర నిధులను అర్హులైన లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసేందుకు వెళుతున్నారు. 
 
నిజానికి ఆయన ఈ నెల 13వ తేదీనే విశాఖకు వెళ్లాల్సివుంది. కానీ, వర్షాల కారణంగా ఆయన తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. ప్రస్తుతం వాతావరణం అనుకూలించడంతో విశాఖకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. 
 
కాగా, ఈ పర్యటనలో వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం లబ్దిదారుల ఖాతాల్లో ఈ యేడాది నిధులను ఆయన జమ చేయనున్నారు. సొంత వాహనాలు కలిగిన ఆటో, క్యాబ్ డ్రైవర్లకు యేడాదికి రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం చేసేలా ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభించిన విషయం తెల్సిందే. ఈ పథకం కింద మొత్తం రూ.261 కోట్లను జమ చేస్తారు. 
 
మరోవైపు, ఈ పర్యటనలో భాగంగా, ఆయన ఆంధ్రా విశ్వవిద్యాయంలో ఏర్పాటుచేసిన వేదికపై నుంచి ఈ నిధులను విడుదల చేసి ఆ తర్వాత లబ్ధిదారులతో ఆయన ముఖాముఖి నిర్వహిస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన తాడేపల్లికి తిరిగి చేరుకుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments