Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపు వాహన మిత్ర నిధుల విడుదల - విశాఖకు వెళ్లనున్న సీఎం జగన్

Webdunia
గురువారం, 14 జులై 2022 (19:35 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి శుక్రవారం విశాఖపట్టణంకు వెళుతున్నారు. వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ఒకటైన వాహన మిత్ర నిధులను అర్హులైన లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసేందుకు వెళుతున్నారు. 
 
నిజానికి ఆయన ఈ నెల 13వ తేదీనే విశాఖకు వెళ్లాల్సివుంది. కానీ, వర్షాల కారణంగా ఆయన తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. ప్రస్తుతం వాతావరణం అనుకూలించడంతో విశాఖకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. 
 
కాగా, ఈ పర్యటనలో వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం లబ్దిదారుల ఖాతాల్లో ఈ యేడాది నిధులను ఆయన జమ చేయనున్నారు. సొంత వాహనాలు కలిగిన ఆటో, క్యాబ్ డ్రైవర్లకు యేడాదికి రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం చేసేలా ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభించిన విషయం తెల్సిందే. ఈ పథకం కింద మొత్తం రూ.261 కోట్లను జమ చేస్తారు. 
 
మరోవైపు, ఈ పర్యటనలో భాగంగా, ఆయన ఆంధ్రా విశ్వవిద్యాయంలో ఏర్పాటుచేసిన వేదికపై నుంచి ఈ నిధులను విడుదల చేసి ఆ తర్వాత లబ్ధిదారులతో ఆయన ముఖాముఖి నిర్వహిస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన తాడేపల్లికి తిరిగి చేరుకుంటారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments