Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజమ్మా.. ఏంటీ లొల్లమ్మా..?

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2021 (22:18 IST)
వైసిపి ఎమ్మెల్యే రోజాకు సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలతోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే నాలుగు మండలాల్లో ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్న నేతలు రోజాను వ్యతిరేకిస్తున్నారు. రోజా క్రిందిస్థాయి కార్యకర్తలతో హీనంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 
సరిగ్గా కొన్నిరోజుల క్రితమే నాలుగు మండలాలు ఏదైతే ఉన్నాయో.. నిండ్ర, వడమాలపేట, పుత్తూరు, విజయపురంలకు చెందిన వైసిపి ఇన్‌ఛార్జ్‌లు ఒక్కటయ్యారు. రోజా తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఎపి సిఎం జగన్ దృష్టికి రోజా వ్యవహార శైలిని తీసుకెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు. 

 
ఏకధాటిగా రోజాను వ్యతిరేకిస్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. రోజా ఈసారి నియోజకవర్గంలో సొంత పార్టీ నాయకులే ఓడిస్తారన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు మరోసారి ఫ్లెక్సీల గొడవ మొదలైంది. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు నేపథ్యంలో భారీ ఫ్లెక్సీలను రోజా వ్యతిరేకులు ఏర్పాటు చేశారు.
 
అయితే ఆ ఫ్లెక్సీలను చించేశారు. రోజా ఆజ్ఞలతోనే ఫ్లెక్సీలను చించేశారంటూ మండిపడ్డారు రోజా వ్యతిరేకులు. రోడ్డుపై కూర్చుని ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. ఇది కాస్త నియోజకవర్గంలో పెద్ద చర్చకు కారణమవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments