Webdunia - Bharat's app for daily news and videos

Install App

Jagan: మూడు సంవత్సరాలు ఓపిక పట్టండి, నేను మళ్ళీ సీఎం అవుతాను.. జగన్ (video)

సెల్వి
సోమవారం, 24 మార్చి 2025 (22:47 IST)
Jagan
"మూడు సంవత్సరాలు ఓపిక పట్టండి, నేను మళ్ళీ సీఎం అవుతాను.. అన్నీ మారుతాయి.." అని వైకాపా అధినేత జగన్ అన్నారు. కనురెప్పపాటులో ఒక సంవత్సరం గడిచిపోయిందని, వచ్చే ఎన్నికల్లో తాను మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యే ముందు రాబోయే మూడు సంవత్సరాలు కూడా అలాగే గడిచిపోతాయని అన్నారు.
 
గతవారం కుండపోత వర్షాల కారణంగా నష్టపోయిన రైతులతో మాట్లాడటానికి పులివెందుల నియోజకవర్గాన్ని సందర్శించినప్పుడు జగన్ మాట్లాడుతూ.. మూడేళ్లలో మళ్లీ ముఖ్యమంత్రి అవుతానని, పరిస్థితులు చక్కదిద్దుతానన్నారు. 
 
అరటి రైతులకు బాసటగా నిలుస్తామని హామీ ఇచ్చారు. మూడేళ్లు ఓపిక పడితే.. మన ప్రభుత్వం వస్తుందని.. ప్రతీ రైతుకు కావాల్సినవి అన్నీ ఇచ్చేస్తానన్నారు. అకాల వర్షాలకు దెబ్బ తిన్న రైతులకు ప్రభుత్వం రైతులకు ఇన్యూరెన్స్‌, ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చి ఆదు కోవాలని ఆయ‌న‌ డిమాండ్‌ చేశారు. 
 
రైతులపై కూటమి ప్రభుత్వం కపట ప్రేమ చూపుతోందని ధ్వజమెత్తారు. వర్ షాలు, గాలులతో పంట నష్టం తీవ్రంగా ఏర్పడిందని చెప్పుకొచ్చారు. నెల కింద రూ.26వేలు ధర పలికితే ఇప్పుడు ఎవరూ కొనడం లేదని వివరించారు. 
 
వైసీపీ హయాంలో ఉచిత పంటల బీమా రైతులకు హక్కుగా ఉండేదన్నారు. ప్రతీ రైతుకు న్యాయం చేసామని చెప్పారు. అరటి సాగులో ఏపీ లోనే పులివెందుల నంబర్‌ వన్‌ స్థానంలో ఉందని చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments