Webdunia - Bharat's app for daily news and videos

Install App

Jagan: మూడు సంవత్సరాలు ఓపిక పట్టండి, నేను మళ్ళీ సీఎం అవుతాను.. జగన్ (video)

సెల్వి
సోమవారం, 24 మార్చి 2025 (22:47 IST)
Jagan
"మూడు సంవత్సరాలు ఓపిక పట్టండి, నేను మళ్ళీ సీఎం అవుతాను.. అన్నీ మారుతాయి.." అని వైకాపా అధినేత జగన్ అన్నారు. కనురెప్పపాటులో ఒక సంవత్సరం గడిచిపోయిందని, వచ్చే ఎన్నికల్లో తాను మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యే ముందు రాబోయే మూడు సంవత్సరాలు కూడా అలాగే గడిచిపోతాయని అన్నారు.
 
గతవారం కుండపోత వర్షాల కారణంగా నష్టపోయిన రైతులతో మాట్లాడటానికి పులివెందుల నియోజకవర్గాన్ని సందర్శించినప్పుడు జగన్ మాట్లాడుతూ.. మూడేళ్లలో మళ్లీ ముఖ్యమంత్రి అవుతానని, పరిస్థితులు చక్కదిద్దుతానన్నారు. 
 
అరటి రైతులకు బాసటగా నిలుస్తామని హామీ ఇచ్చారు. మూడేళ్లు ఓపిక పడితే.. మన ప్రభుత్వం వస్తుందని.. ప్రతీ రైతుకు కావాల్సినవి అన్నీ ఇచ్చేస్తానన్నారు. అకాల వర్షాలకు దెబ్బ తిన్న రైతులకు ప్రభుత్వం రైతులకు ఇన్యూరెన్స్‌, ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చి ఆదు కోవాలని ఆయ‌న‌ డిమాండ్‌ చేశారు. 
 
రైతులపై కూటమి ప్రభుత్వం కపట ప్రేమ చూపుతోందని ధ్వజమెత్తారు. వర్ షాలు, గాలులతో పంట నష్టం తీవ్రంగా ఏర్పడిందని చెప్పుకొచ్చారు. నెల కింద రూ.26వేలు ధర పలికితే ఇప్పుడు ఎవరూ కొనడం లేదని వివరించారు. 
 
వైసీపీ హయాంలో ఉచిత పంటల బీమా రైతులకు హక్కుగా ఉండేదన్నారు. ప్రతీ రైతుకు న్యాయం చేసామని చెప్పారు. అరటి సాగులో ఏపీ లోనే పులివెందుల నంబర్‌ వన్‌ స్థానంలో ఉందని చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments