Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరిటాల రవి హత్య కేసు : సందేహం ఉంటే విచారణ.. జేసీ

Webdunia
మంగళవారం, 19 ఆగస్టు 2014 (16:16 IST)
పరిటాల రవి హత్య కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఒక వేళ తనపై ఇంకా సందేహం ఉన్నా మరోమారు విచారణ జరిపించుకోవచ్చని అనంతపురం టీడీపీ ఎంపీ, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీలోని టీడీఎల్పీ కార్యాలయం వద్ద ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
తనపై గతంలోనే విచారణ చేశారని... అవసరమనుకుంటే మరోసారి విచారణకు తాను సిద్ధమని చెప్పారు. వైకాపా అధినేత జగన్ తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పరిటాల రవి హత్యతో తనను ముడిపెట్టేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు.
 
కాగా... హత్యారాజకీయాలపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చకు అనుమతించాలని స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు వైకాపా సభ్యులు మంగళవారం నోటీసు ఇచ్చారు. ప్రశ్నోత్తరాలు కొంచెం సేపు జరిగిన తర్వాత... తాము ఇచ్చిన నోటీసుకు అనుగుణంగా రాష్ట్రంలోని శాంతి భద్రతలపై చర్చకు అనుమతివ్వాలని వైకాపా సభ్యులు స్పీకర్‌ను డిమాండ్ చేశారు.

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments