Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరోపణలు కాదు.. దమ్ముంటే విచారణ జరిపించండి : ఐవైఆర్ సవాల్

తనపై ఆరోపణలు చేయడం మానుకుని దమ్ముంటే విచారణ జరిపించి నిగ్గు తేల్చాలని మాజీ సీఎస్, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు సవాల్ విసిరారు.

Webdunia
ఆదివారం, 25 జూన్ 2017 (14:39 IST)
తనపై ఆరోపణలు చేయడం మానుకుని దమ్ముంటే విచారణ జరిపించి నిగ్గు తేల్చాలని  మాజీ సీఎస్, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు సవాల్ విసిరారు. 
 
తనకు ప్రకాశం జిల్లా దొనకొండలో వందలాది ఎకరాల భూములు ఉన్నట్టు టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు చేసిన ఆరోపణలపై ఐవైఆర్ ఆదివారం స్పందించారు. ఈ ప్రాంతంలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడా కూడా ఎలాంటి భూములూ లేవన్నారు. 
 
ఈ విషయంలో తెలుగుదేశం నేత రాయపాటి సాంబశివరావు చేసిన ఆరోపణలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని,దమ్ముంటే రాయపాటి చేసిన ఆరోపణలపై విచారణ జరిపించి నిజానిజాలను తేల్చాలని సవాల్ విసిరారు. 
 
తనకు భూములున్నట్టు రాయపాటి మాట్లాడటం పెద్ద అబద్ధమని అన్న ఐవైఆర్, అబద్ధాలు చెప్పడం, దాన్ని నిజం చేయాలని అనుకోవడం టీడీపీ నేతలకు అలవాటుగా మారిందని విమర్శించారు. తనపై చేసిన ఆరోపణలు తప్పని తేలితే ఆయనపై ఎలాంటి చర్య తీసుకుంటే ప్రభుత్వ విజ్ఞతకే వదిలివేస్తున్నట్టు చెప్పారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments