Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరోపణలు కాదు.. దమ్ముంటే విచారణ జరిపించండి : ఐవైఆర్ సవాల్

తనపై ఆరోపణలు చేయడం మానుకుని దమ్ముంటే విచారణ జరిపించి నిగ్గు తేల్చాలని మాజీ సీఎస్, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు సవాల్ విసిరారు.

Webdunia
ఆదివారం, 25 జూన్ 2017 (14:39 IST)
తనపై ఆరోపణలు చేయడం మానుకుని దమ్ముంటే విచారణ జరిపించి నిగ్గు తేల్చాలని  మాజీ సీఎస్, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు సవాల్ విసిరారు. 
 
తనకు ప్రకాశం జిల్లా దొనకొండలో వందలాది ఎకరాల భూములు ఉన్నట్టు టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు చేసిన ఆరోపణలపై ఐవైఆర్ ఆదివారం స్పందించారు. ఈ ప్రాంతంలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడా కూడా ఎలాంటి భూములూ లేవన్నారు. 
 
ఈ విషయంలో తెలుగుదేశం నేత రాయపాటి సాంబశివరావు చేసిన ఆరోపణలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని,దమ్ముంటే రాయపాటి చేసిన ఆరోపణలపై విచారణ జరిపించి నిజానిజాలను తేల్చాలని సవాల్ విసిరారు. 
 
తనకు భూములున్నట్టు రాయపాటి మాట్లాడటం పెద్ద అబద్ధమని అన్న ఐవైఆర్, అబద్ధాలు చెప్పడం, దాన్ని నిజం చేయాలని అనుకోవడం టీడీపీ నేతలకు అలవాటుగా మారిందని విమర్శించారు. తనపై చేసిన ఆరోపణలు తప్పని తేలితే ఆయనపై ఎలాంటి చర్య తీసుకుంటే ప్రభుత్వ విజ్ఞతకే వదిలివేస్తున్నట్టు చెప్పారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

య‌ష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)

Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !

Tammareddy: ఉమెన్ సెంట్రిక్ గా సాగే ఈ సినిమా బాగుంది : తమ్మారెడ్డి భరద్వాజ్

చౌర్య పాఠం నుంచి ఆడ పిశాచం.. సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments