Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమావేశాలు జరుగుతున్నపుడు రాహుల్‌కు సెలవా? : శశిథరూర్

Webdunia
శనివారం, 28 ఫిబ్రవరి 2015 (15:13 IST)
పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సెలవుపై వెళ్లడాన్ని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ విమర్శించారు. ఇదే అంశంపై ఆయన శనివారం మాట్లాడుతూ.. బడ్జెట్ సమావేశాలకు ఆయన హాజరైతే బాగుండేదని అభిప్రాయపడ్డారు. 
 
అయితే చాలా కొత్తగా, పార్టీలో మార్పుకోసం మంచి అజెండాతో పార్టీ ఉపాధ్యక్షుడు తిరిగి వస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు. తను రాసిన కొత్త పుస్తకం 'ఇండియా సహస్త్ర'పై ఢిల్లీలో చర్చ సందర్భంగా థరూర్‌పై విధంగా మాట్లాడారు. 
 
ఇదే అంశంపై ఇప్పటికే ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కూడా స్పందించారు. రాహుల్ సెలవుపై వెళ్లేందుకు సరైన సమయం ఇది కాదన్నారు. ప్రజా సమస్యలపై సభలో ప్రస్తావించే అవకాశం కోల్పోవడం భావ్యం కాదని ఆయన వ్యాఖ్యానించారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments